మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్పై మంత్రుల బృందాన్ని నియమించింది ఏపీ ప్రభుత్వం.. ఈ పథకం అమలుపై సాధ్యాసాధ్యాలు మంత్రుల బృందం పరిశీలించింది.. బాలికలతో సహా మహిళలకు ఉచిత ప్రజా రవాణాను అందించే కర్ణాటక శక్తి పథకం అమలును గుర్తించి, ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది.. రవాణా శాఖామంత్రి చైర్మన్ గా, హోంమంత్రి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖామంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ప్రధానకార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉన్నారు..
Farmers Income: ఈ సంవత్సరం రైతుల ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఒక అధ్యయన సంస్థ శుభవార్త చెప్పింది. రబీ సీజన్లో ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదవుతుందని అంచనా వేసింది. ఓపెన్ మార్కెట్లో పంటల రేట్లు కూడా భారీగానే పెరగనున్నాయని.. ఫలితంగా.. కర్షకులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొంది. ఎరువుల రేట్లు సైతం దిగొస్తాయని, తద్వారా అన్నదాతలకు అన్నివిధాలుగా కలిసొస్తుందని వివరించింది.