తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదివే పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకు ఒక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది యువకుడు ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… రాయవరం మండలం పసపూడికి చెందిన ఒకరు వ్యవసాయ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్న ఆయన కుమారుడు సెలవు రోజున ఇంటికి వచ్చాడు. తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులపై…
హైదరాబాద్ నల్లగండ్ల అపర్ణ సరోవర్లో విషాదం నెలకొంది. చదువుకోమని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ సీ బ్లాక్ 14వ ఫ్లోర్లో అమిత్ కుటుంబం నివాసం ఉంటోంది. అమిత్ కుమారుడు అద్వైత్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అల్లరి చేస్తున్న విద్యార్థి అద్వైత్ను తండ్రి మందలించాడు. చదువుకోమని గట్టిగా అరిచాడు. దీంతో మనస్తాపం చెందిన అద్వైత్… 14వ…
తెలంగాణలో ఇంటర్ విద్యార్దులు ఫస్టియర్ విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, కాంగ్రెస్.. ఇతర విద్యార్ధి సంఘాలు ఇంటర్ బోర్డుపై వత్తిడి తెచ్చాయి. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ… పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో తమ ఉద్యమ ఫలితంగా ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వంలో కదలిక…
జ్యోతి రావు పూలే కాలేజీ అధ్యాపకుల నిర్లక్ష్యం. సీనియర్ల బలవంతం ఓ విద్యార్థి పాలిట శాపంగా మారింది. ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని కరుణాపురంలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ హాస్టల్ లో పరకాల శాయంపేటకి చెందిన భరత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఇదే హాస్టల్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీనియర్స్ గుట్కా పాకెట్స్ తీస్కొని రమ్మని సోమవారం భరత్ పై…
మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థి విజయ్ భాస్కర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ భాస్కర్. విద్యార్ధి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తోంది జేబీఐటీ కాలేజ్ యాజమాన్యం. జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ 2వ ఏడాది చదువుతున్నాడు విజయ్ భాస్కర్. హాస్టల్ గది…