దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. దశాబ్దకాలంగా ఈ కేసు నడుస్తోంది. ఈ కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్నారు. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
హర్యానాలోని గురుగ్రామ్లో హత్యకు గురైన టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ (25) కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కన్న తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపేశాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది. మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది.
యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. "క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది." అని ఆయన స్పష్టం చేశారు. 1986లో…
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ప్రకటన సెక్యులరిజంపై కొత్త చర్చకు నాంది పలికింది. భారతదేశానికి సెక్యులరిజం అవసరం లేదని, ఇది యూరప్ భావన అని ఆయన అన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీన్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎంట్రీ ఇచ్చింది.
Iran : ఇరాన్ ప్రధాన దక్షిణ-ఉత్తర గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్లో బుధవారం రెండు పేలుళ్లు సంభవించాయని ఇరాన్ చమురు మంత్రి ప్రకటించారు. కొన్ని ప్రావిన్సులలోని పరిశ్రమలు, కార్యాలయాలకు ఈ సంఘటన గ్యాస్ కోతలకు కారణమైందన్న వార్తలను రాష్ట్ర మీడియా నివేదించింది వీటిని అధికారులు ఖండించారు.
మాజీ ఎంపీ గడ్డం వినోద్ ఇంట్లో సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో గడ్డం వినోద్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని తెలిపారు. దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఈడీ ప్రకటించింది. అంతేకాకుండా.. భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించింది ఈడీ. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. యశ్వంత్ రియాల్టీతో పాటుగా గడ్డం వినోదు భార్య పేర్లతో భారీగా ఆస్తులను గుర్తించారు.
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు.