Narayana Murthy: ఐటీ ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేయాల్సిందే.. ఇన్ఫోసిస్ అధినేత కీలక వ్యాఖ్యలు
- వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు
- కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని స్పష్టం
- ఈ అంశంలో తన అభిప్రాయం ఎప్పటికీ మారదన్న నారాయణ మూర్తి
- జర్మనీ, జపాన్లను ఆదర్శంగా తీసుకోవాలన్న ఐటీ రంగ నిపుణుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. “క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది.” అని ఆయన స్పష్టం చేశారు. 1986లో వారానికి 6 రోజుల పని నుంచి 5 రోజులకు మారినప్పుడు.. తాను చాలా బాధపడ్డానన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ప్రస్తావిస్తూ.. మోడీ వారానికి 100 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన అంత కష్టపడగలిగితే మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు.
READ MORE: Anil Ambani: అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్ఈసీఐ షోకాజ్ నోటీసు
Also Read
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
- Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
మనం కూడా పనిచేసి ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే అంశంపై ఆలోచించలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్లు ఎలా అభివృద్ధి చెంది మళ్లీ ధనిక దేశాలుగా మారాయో ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. మనం వారిని చూసి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. భారతదేశం కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని, దాని ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని సూచించారు. జర్మనీ, జపాన్ ప్రజలు చేసిన ప్రయత్నాలే మనం కూడా చేయాలని చెప్పారు. తాను తన జీవితాంతం ఈ ఆలోచనను అనుసరిస్తానని.. ఎల్లప్పుడూ 14 గంటలు పనిచేశాస్తానన్నారు. వారంలో ఆరున్నర రోజులు పని చేస్తూనే ఉన్నానని చెప్పారు. రోజూ ఉదయం 6:30 గంటలకు ఆఫీసుకు చేరుకునేవాడిని, తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి బయలుదేరేవాడినని చెప్పారు. ఈ జీవనశైలికి తాను గర్వపడుతున్నారు. ప్రపంచంలో విజయానికి ఒకే ఒక్క మార్గమని.. అది కష్టపడి పనిచేయడమేనని 78 ఏళ్ల వ్యాపారవేత్త స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: పీఎం మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
సాధారణంగా… భారత్లో రోజుకు 8గంటల పనిగంటలు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో వారానికి ఒక రోజు సెలవు ఉండగా… ఐటీ సెక్టార్లో మాత్రం శని, ఆదివారాలు సెలవు. ఈ లెక్కన వారానికి ఒక్కో ఉద్యోగి దాదాపు 50 గంటల వరకు పనిచేస్తుంటారు. అయితే… ఇది సరిపోదని.. వారానికి 70 గంటల పనిచేయాలన్నది ఇన్పోసిస్ నారాయణ మూర్తి వాదన అంటే. రోజుకు సగటును… 12గంటలు పనిచేయాలని ఆయన చెప్తున్నారు. దేశం కోసం శ్రమిస్తామని యువత ప్రతిబూని పనిచేయాలని ఆయన వాదన. గతంలో కూడా ఆయన ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం మరోసారి గుర్తుచేశారు.
తాజావార్తలు
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!