Narayana Murthy: ఐటీ ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేయాల్సిందే.. ఇన్ఫోసిస్ అధినేత కీలక వ్యాఖ్యలు
- వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు
- కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని స్పష్టం
- ఈ అంశంలో తన అభిప్రాయం ఎప్పటికీ మారదన్న నారాయణ మూర్తి
- జర్మనీ, జపాన్లను ఆదర్శంగా తీసుకోవాలన్న ఐటీ రంగ నిపుణుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. “క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది.” అని ఆయన స్పష్టం చేశారు. 1986లో వారానికి 6 రోజుల పని నుంచి 5 రోజులకు మారినప్పుడు.. తాను చాలా బాధపడ్డానన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ప్రస్తావిస్తూ.. మోడీ వారానికి 100 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన అంత కష్టపడగలిగితే మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు.
READ MORE: Anil Ambani: అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్ఈసీఐ షోకాజ్ నోటీసు
Also Read
- August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
- Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
- JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్లు, 1,000 టీవీ ఛానెల్స్..
మనం కూడా పనిచేసి ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే అంశంపై ఆలోచించలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్లు ఎలా అభివృద్ధి చెంది మళ్లీ ధనిక దేశాలుగా మారాయో ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. మనం వారిని చూసి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. భారతదేశం కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని, దాని ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని సూచించారు. జర్మనీ, జపాన్ ప్రజలు చేసిన ప్రయత్నాలే మనం కూడా చేయాలని చెప్పారు. తాను తన జీవితాంతం ఈ ఆలోచనను అనుసరిస్తానని.. ఎల్లప్పుడూ 14 గంటలు పనిచేశాస్తానన్నారు. వారంలో ఆరున్నర రోజులు పని చేస్తూనే ఉన్నానని చెప్పారు. రోజూ ఉదయం 6:30 గంటలకు ఆఫీసుకు చేరుకునేవాడిని, తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి బయలుదేరేవాడినని చెప్పారు. ఈ జీవనశైలికి తాను గర్వపడుతున్నారు. ప్రపంచంలో విజయానికి ఒకే ఒక్క మార్గమని.. అది కష్టపడి పనిచేయడమేనని 78 ఏళ్ల వ్యాపారవేత్త స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: పీఎం మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
సాధారణంగా… భారత్లో రోజుకు 8గంటల పనిగంటలు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో వారానికి ఒక రోజు సెలవు ఉండగా… ఐటీ సెక్టార్లో మాత్రం శని, ఆదివారాలు సెలవు. ఈ లెక్కన వారానికి ఒక్కో ఉద్యోగి దాదాపు 50 గంటల వరకు పనిచేస్తుంటారు. అయితే… ఇది సరిపోదని.. వారానికి 70 గంటల పనిచేయాలన్నది ఇన్పోసిస్ నారాయణ మూర్తి వాదన అంటే. రోజుకు సగటును… 12గంటలు పనిచేయాలని ఆయన చెప్తున్నారు. దేశం కోసం శ్రమిస్తామని యువత ప్రతిబూని పనిచేయాలని ఆయన వాదన. గతంలో కూడా ఆయన ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం మరోసారి గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
-
Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
-
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!