Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు.. ఇంద్రాణి కుమార్తె ఏం వాంగ్మూలం ఇచ్చిందంటే..!
- షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు
- సంచలనంగా మారిన ఇంద్రాణి కుమార్తె వాంగ్మూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. దశాబ్దకాలంగా ఈ కేసు నడుస్తోంది. ఈ కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్నారు. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని తేల్చి చెప్పింది. సీబీఐ చార్జిషీట్లో ఉన్న వాంగ్మూలం నకిలీని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కోర్టులో ఖండించారు.
ఇది కూడా చదవండి: Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
Also Read
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- My Son Is Innocent: కేతన్ హ*త్య కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు.. నేను సియాను ఇంతకు ముందెన్నడూ చూడలేదు..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసును వాదించుకోవడానికి తన తల్లి దగ్గర ఎలాంటి నిధులు లేవని.. ఆమెకు సంబంధించిన ఆభరణాలు, రూ.7 కోట్ల నగదును మీడియా అధినేత పీటర్ ముఖర్జియా కుమారులు రాహుల్, రాబిన్ దొంగిలించారని ఆరోపించింది. కుట్రపూరితంగా ఇంద్రాణిని ఈ కేసులో ఇరికించారని వాపోయింది. ఇంద్రాణిని అరెస్ట్ చేసినప్పుడు తాను మైనర్ అని చెప్పింది. ఈ దుర్ఘటన నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నట్లు వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యానని.. అలాగే సీబీఐ అడిగిన ప్రశ్నలకకు కూడా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అయితే సీబీఐ బయట పెట్టిన వాంగ్మూలాలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. విచారణ సమయంలో తనతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించింది. ఇంద్రాణి, సంజీవ్ను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
2012లో షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్రాయ్, సంజీవ్ ఖన్నాలు హత్య చేసినట్లు కేసు నమోదైంది. 2015లో ఓ ఆయుధాల కేసులో శ్యామ్ అరెస్టు కాగా షీనా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇంద్రాణి, సంజీవ్, పీటర్లను అరెస్టు చేశారు. ఈ హత్య తర్వాత షీనా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె మెయిల్ నుంచి ఇంద్రాణి సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
-
39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
-
Tollywood : చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఫైర్
-
Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
-
Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!