Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు.. ఇంద్రాణి కుమార్తె ఏం వాంగ్మూలం ఇచ్చిందంటే..!
- షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు
- సంచలనంగా మారిన ఇంద్రాణి కుమార్తె వాంగ్మూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. దశాబ్దకాలంగా ఈ కేసు నడుస్తోంది. ఈ కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్నారు. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని తేల్చి చెప్పింది. సీబీఐ చార్జిషీట్లో ఉన్న వాంగ్మూలం నకిలీని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కోర్టులో ఖండించారు.
ఇది కూడా చదవండి: Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
Also Read
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసును వాదించుకోవడానికి తన తల్లి దగ్గర ఎలాంటి నిధులు లేవని.. ఆమెకు సంబంధించిన ఆభరణాలు, రూ.7 కోట్ల నగదును మీడియా అధినేత పీటర్ ముఖర్జియా కుమారులు రాహుల్, రాబిన్ దొంగిలించారని ఆరోపించింది. కుట్రపూరితంగా ఇంద్రాణిని ఈ కేసులో ఇరికించారని వాపోయింది. ఇంద్రాణిని అరెస్ట్ చేసినప్పుడు తాను మైనర్ అని చెప్పింది. ఈ దుర్ఘటన నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నట్లు వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యానని.. అలాగే సీబీఐ అడిగిన ప్రశ్నలకకు కూడా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అయితే సీబీఐ బయట పెట్టిన వాంగ్మూలాలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. విచారణ సమయంలో తనతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించింది. ఇంద్రాణి, సంజీవ్ను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
2012లో షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్రాయ్, సంజీవ్ ఖన్నాలు హత్య చేసినట్లు కేసు నమోదైంది. 2015లో ఓ ఆయుధాల కేసులో శ్యామ్ అరెస్టు కాగా షీనా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇంద్రాణి, సంజీవ్, పీటర్లను అరెస్టు చేశారు. ఈ హత్య తర్వాత షీనా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె మెయిల్ నుంచి ఇంద్రాణి సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!