Secularism: అంబేడ్కర్, నెహ్రూ వ్యతిరేకించిన “సెక్యులరిజం” పదాన్ని రాజ్యాంగంలో చేర్చిందెవరు?
- తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ప్రకటనపై మరోసారి చర్చ
- భారతదేశానికి సెక్యులరిజం అవసరం లేదని గవర్నర్ వ్యాఖ్య
- సెక్యులరిజాన్ని వ్యతిరేకించిన అంబేడ్కర్.. నెహ్రూ
- ఈ పదాన్ని రాజ్యాంగంలో చేర్చిందెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ప్రకటన సెక్యులరిజంపై కొత్త చర్చకు నాంది పలికింది. భారతదేశానికి సెక్యులరిజం అవసరం లేదని, ఇది యూరప్ భావన అని ఆయన అన్నారు. ఈ ప్రకటనను కాంగ్రెస్తో పాటు అన్ని విపక్షాలు ఖండించాయి. సీపీఎం నాయకురాలు బృందా కారత్ని విమర్శించారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి, వాటిలో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం, లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు.” అని ఆర్ఎన్ రవి తెలిపారు. చర్చి, రాజుకు మధ్య జరిగిన పోరాటం వల్ల అది ఉద్భవించింది. కానీ భారత్ ధర్మానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వైరుధ్యాలు ఉండవు. కాబట్టి సెక్యులరిజాన్ని ఐరోపాలోనే ఉండనివ్వండి. భారతదేశంలో దాని అవసరం ఏ మాత్రం లేదు’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా..ప్రస్తుతం సెక్యులరిజం అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఈ పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చిందెవరో తెలుసుకుందాం..
రాజ్యాంగ పరిషత్లో సెక్యులరిజం అనే పదంపై చర్చ..
Also Read
ఇదిలా ఉండగా.. రాజ్యాంగ పరిషత్లో సెక్యులరిజం అనే పదంపై చర్చ జరిగింది. 1948 నవంబర్ 15న రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రొఫెసర్ కె.టి.షా రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చాలని అధికారికంగా డిమాండ్ చేశారు. సెక్యులర్, ఫెడరలిస్ట్, సోషలిస్ట్ అనే పదాలను జోడించాలని కోరారు. కానీ ఆయన ప్రతిపాదనకు అంగీకరించలేదు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ కూడా సెక్యులర్ పదాన్ని జోడించడాన్ని వ్యతిరేకించారు. ఇద్దరూ లౌకికవాదాన్ని గట్టిగా సమర్థించేవారు. రాజ్యాంగం మొత్తం లౌకిక రాజ్య భావనపై ఆధారపడి ఉన్నందున ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చాల్సిన అవసరం లేదని డాక్టర్ అంబేడ్కర్ వాదన. రాజ్య విధానం ఎలా ఉండాలి, సమాజం సామాజిక, ఆర్థిక అంశాలలో ఎలా వ్యవస్థీకృతం కావాలనేవి.. సమయం, పరిస్థితులకు అనుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అంశాలని అంబేడ్కర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నందున దీన్ని రాజ్యాంగంలో ఉంచలేమన్నారు.
అంబేడ్కర్ ఏం చెప్పారు?
ఫలితంగా సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. అయితే సెక్యులరిజం స్ఫూర్తిని పెంచేందుకు రాజ్యాంగ పరిషత్ 25, 26, 27వ అధికరణలను జోడించింది. మొత్తంమీద.. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి లౌకికవాదం అనే పదాన్ని ప్రస్తావించకుండానే ఉంది. ఏది ఏమైనా.. సమానత్వం అంటే ఎలాంటి వివక్ష లేదు. పౌరులందరికీ సమాన హక్కులు ఉంటే, మతం, కులం, ప్రాంతం, వర్ణం లేదా మరే విధమైన వివక్ష లేకుండా అందరికీ సమానమైన గౌరవం, అందరికీ సమాన హక్కులు అని కూడా అర్థం.
పదాన్ని రాజ్యంగ పీఠికలో చేర్చిన ఇందిరా గాంధీ..
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని చేర్చడాన్ని వ్యతిరేకించగా.. ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఈ పదాన్ని ప్రవేశికలో భాగంగా చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు.. ఇందిరా గాంధీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ మరియు ‘సెక్యులర్’ పదాలను చేర్చారు. అయితే సెక్యులరిజం పేరుతో అవకాశవాద రాజకీయాలు, ప్రత్యేక వర్గాన్ని బుజ్జగించే ధోరణి పెరిగిపోయిందని కొట్టిపారేయలేం… సెక్యులర్ అనే పదాన్ని తప్పుగా అన్వయించవచ్చు. దుర్వినియోగం చేయవచ్చని కొందరు విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!