ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం…
షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో “ఆర్ఆర్ఆర్” బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు, హీరోల క్యారెక్టర్ కు సంబంధిచిన టీజర్లను మినహాయించి ఏమీ విడుదల చేయలేదు. ఎట్టకేలకు జూలై 15న ఉదయం 11 గంటలకు “ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ…
అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్” షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. దీంతో ఎట్టకేలకు ఈ చిత్ర ప్రమోషన్లను ప్రారంభించాలని ‘ఆర్ఆర్ఆర్’ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరికొన్ని వారాల్లో వరుస అప్డేట్లతో ఈ బృందం ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది అంటున్నారు. దర్శకుడు రాజమౌళి…
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా “ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవలే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తేలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. జూలై 6 నుండి “ఆర్ఆర్ఆర్” చివరి దశ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సాంగ్స్…
ఇండియాలోనే ప్రముఖ దిగ్గజ దర్శకులలో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఢిల్లీ విమానాశ్రయం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఆయన సోషల్ మీడియాను ఉపయోగించారు. “ఢిల్లీ విమానాశ్రయానికి లుఫ్తానాసా విమానంలో ఉదయం 1 గంటలకు చేరుకున్నాను. అక్కడ ఆర్టీపిసిఆర్ పరీక్ష ఫామ్ నింపడానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొంతమంది నిలబడి ఫామ్ ఫిల్ చేస్తుంటే, మరికొంత దానికోసం గోడలను ఆసరా చేసుకున్నారు. దరఖాస్తు ఫామ్ లను నింపడానికి టేబుల్ సిస్టం ఉంటే బాగుంటుందని…
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందనే స్టేట్మెంట్ తో మరింత ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఒకే బైక్పై వెళ్తోన్న ఓ ఫొటోను విడుదల చేశారు. చిరునవ్వులు చిందిస్తూ వారిద్దరు ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది.…
(జూన్ 23న ‘విక్రమార్కుడు’కు 15 ఏళ్ళు)పాతకథకైనా కొత్త నగిషీలు చెక్కి, జనాన్ని ఇట్టే కట్టిపడేయంలో రాజమౌళి మొనగాడు. అందులో ఏలాంటి సందేహమూ లేదు. ఆయన చిత్రాలు ఎలాఉన్నా, ఒకసారైనా చూడవచ్చునని జనమే ఏ నాడో ‘రాజముద్ర’ వేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘విక్రమార్కుడు’. అచ్చు గుద్దినట్టుండే పోలికలతో హీరోలు డ్యుయల్ రోల్ చేయడం తెలుగు చిత్రసీమలో సదా పేయబుల్ ఎలిమెంటే! ఆ సూత్రాన్ని అనుసరించే రాజమౌళి ‘విక్రమార్కుడు’ తెరకెక్కించారు. ఆరంభంలో కొందరు మేధావులు…
బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాదే రానుందని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది జనవరి 26న…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్ రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ…