ప్యారిస్ ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా చరిత్ర సృష్టించి దేశం గర్వించేలా చేసింది. 16వ రౌండ్కు అంటే ప్రీ-క్వార్టర్ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, భారత్ జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. రెండు జట్లూ తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. నేడు శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పారిస్ వేదికగా ఒలింపిక్స్-2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ ఆరంభరోజు భారత్కు చెందిన అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యువ షూటర్ మనుబాకర్ మాత్రం అదరగొట్టింది. 2020 ఒలింపిక్స్లో మూడు విభాగాల్లో పోటీ పడి ఈవెంట్లోనూ ఫైనల్ చేరకుండా నిరాశపరిచిన మనుబాకర్.. ఈ సారి అంచనాలను అందుకుంటూ పోటీ పడ్డ తొలి ఈవెంట్లోనే ఫైనల్ చేరి పతకం మీద ఆశలు రేపింది.
కొత్త కోచ్-కెప్టెన్ ద్వయం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు.
ఇండియా, శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ ఈ రోజు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే. ఈ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక విజయంతో సిరీస్ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు.
షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ తరఫున టీ20 ఫార్మాట్లో మాత్రమే యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, "నేను ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాను.
జింబాబ్వేతో టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పుడు మూడో మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.