పారిస్ ఒలింపిక్ విజేతలు నేడు ప్రధాని మోడీ కలిశారు. జులై 26న ప్రారంభమై ఆగస్టు 11న ముగిసిన విషయం తెలిసిందే. భారత్ నుంచి117 మంది సభ్యుల బృందం పారిస్ వెళ్ళింది.
బీసీసీఐ గొప్ప మనసు చాటుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత.. నేపాల్ క్రికెట్ జట్టుకు భారత్లో సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కాగా.. బీసీసీఐ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ను భారతదేశంలో తన మ్యాచ్లను నిర్వహించడానికి అనుమతించింది. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనేందుకు నేపాల్ జట్టుకు బీసీసీఐ అనుమతినిచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు మరో పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 6 పతకాలు వచ్చాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Hop On Kangaroo: టూరిజం పేరుతో కపుల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ విదేశాలకు తీసుకెళ్లే ఆఫర్స్ చూస్తుంటాం.. కానీ, స్పోర్ట్స్ టూరిజం ఎప్పుడైనా విన్నారా..? మీకు క్రీడలపై ఆసక్తి ఉంటే చాలు.. విదేశాలకు తీసుకెళ్లి స్టార్ ప్లేయర్స్తో గేమ్స్ ఆడే అవకాశం కల్పిస్తోంది ఓ సంస్థ. ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఓ వినూత్న ప్రయోగానికి “హాప్ ఆన్ కంగారు “సంస్థ శ్రీకారం చుట్టింది. ఇక, ఇందు కోసం ఏం చేయాలి..? విదేశాలకు వెళ్లేందుకు…
భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 22 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మ్యాచ్లో 32 ఏళ్ల స్వదేశీయుడు హెచ్ఎస్ ప్రణయ్కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో ఎన్నో పతకాశలతో వెళ్లిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్లో ఓటమి చవిచూసింది.
ఒలింపిక్స్ పాల్గొంటే చాలని క్రీడాకారులంతా కలలు కంటూ ఉంటారు. పతకం గెలవకపోయినా ఈ క్రీడల్లో పాల్గొంటే చాలని అహర్నశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఈజిప్ట్కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్(26), 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడింది..
పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్లో చైనా బాక్సర్ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్స్లో కూడా బెల్జియం భారత్ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో బెల్జియం 2-1తో భారత్ను ఓడించింది.