Abhishek Sharma: అభిషేక్ శర్మ హెల్త్ రిపోర్ట్ రిలీజ్.. పాకిస్థాన్ మ్యాచ్లో ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Health Report: టీ20 మ్యాచ్లో కొనసాగుతున్నాయి. బరిలో నిలిచిన టీమ్లు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు భారత్ రెండో మ్యాచ్కు సిద్ధమవుతోంది. నేడు నమీబియాతో టీమిండియా తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్లో ఇప్పటికే స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు. దూకుడు బ్యాటింగ్తో పేరున్న ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ.. నమీబియాతో జరిగే మ్యాచ్లో ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం పాకిస్థాన్తో కీలక పోరు ఉండటంతో జట్టు యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.
READ MORE: Sai Durga Tej : కథ నచ్చి.. ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిదుర్గాతేజ్
Also Read
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
అసలు ఏం జరిగింది?
ఫిబ్రవరి 6న ముంబై వాంఖడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ అనంతరం అభిషేక్ ఆహారం తీసుకున్నాడు. ఎలాంటి ఫుడ్ తిన్నాడనే అంశంపై క్లారిటీ లేదు. ఈ ఫుడ్ తిన్న వెంటనే కడుపు సమస్య మొదలైంది. ఆ మ్యాచ్ నాటికి పరిస్థితి మరింత విషమించింది. అయినప్పటికీ, జట్టుకోసం మైదానంలోకి దిగాడు. కానీ అమెరికాతో జరిగిన మ్యాచ్లో కేవలం బాల్ మాత్రమే ఆడి ఔటయ్యాడు. దీంతో అభిషేక్ ఆరోగ్యంపై వార్తలు వచ్చాయి. డగౌట్లోనూ అభిషేక్ కనిపించకపోవడంతో ఈ పుకార్లు బలపడ్డాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత సహచరులతో కలిసి హ్యాండ్షేక్ చేయడానికి అభిషేక్ రాలేదు.
READ MORE: DK Shivakumar: హస్తినలో డీకే.శివకుమార్.. సోనియా, రాహుల్గాంధీతో కీలక భేటీ
అభిషేక్ హెల్త్ రిపోర్ట్..
అయితే.. తాజాగా అభిషేక్ హెల్త్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం.. కడుపు ఇన్ఫెక్షన్తో పాటు వాతావరణ మార్పు కారణంగా జ్వరం వచ్చింది. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో నీరు తగ్గి, తక్కువ సమయంలోనే బరువు కూడా తగ్గిపోయడట. ఈ పరిస్థితిలో అభిషేక్ను బుధవారం వరకు ఢిల్లీ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతున్నా.. పూర్తి స్థాయి ఫిట్గా లేడట. కొంత రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకోసమే బుధవారం జట్టు ప్రాక్టీస్ సెషన్కూ హాజరు కాలేదు. ప్రస్తుతం తన ఆరోగ్యం త్వరగా కుదుటపడేందుకు అభిషేక్ తన వ్యక్తిగత ట్రైనర్ను ఢిల్లీకి పిలిపించుకున్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్తో మ్యాచ్కు వెళ్లే ముందు ఫిట్నెస్ పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నాడు అభిషేక్. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అభిషేక్ పాకిస్థాన్తో మ్యాచ్ ఆడాలని, అందుకోసం ఫిట్గా ఉండాలని తాపత్రయపడుతున్నాడు. అటు జట్టు యాజమాన్యం నిర్ణయం, ఇటు అభిషేక్ పట్టుదల చూస్తుంటే దాదాపు పాక్ మ్యాచ్లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!