ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి, కీలక అధికారులు హాజరుకాబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు తెలిపారు. Read: 63శాతం పెరిగిన టమోటా ధరలు… ధరల స్థిరీకరణకు……
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కుదిపేస్తున్నది. వివిధ రూపాలుగా మార్పులు చెందుతూ మరింత బలంగా మారి విరుచుకుపడుతున్నది. తాజాగా దక్షిణాఫ్రికాలో బి 1.1.529 వేరియంట్ను గుర్తించారు. ఈ వేరియంట్లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఇది ప్రమాదకరమైన వేరియంట్గా గుర్తించి దీనికి ఒమిక్రాన్ గా పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. దక్షిణాఫ్రికాతో పాటుగా బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లో కనిపించింది. Read: బెంగళూరులో మళ్లీ అదే భయం… ఆందోళనలో…
దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి…
దక్షిణాఫ్రికా ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు ఏబీ డివిలియర్స్. ఇక తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. తన వయస్సు పై బడిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు ఏబీడీ. ”ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్ల మా అన్నయ్యలతో మ్యాచ్…
ఈ నెల 17 నుండి న్యూజిలాండ్ జట్టుతో భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదట కివీస్ తో టీ20 సిరీస్ లో తలపడనున్న టీం ఇండియా ఆ తర్వాత టెస్ట్ సిరీస్ లో పాల్గొంటుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించిన సమయంలో బీసీసీఐ చాలా విమర్శలు ఎదుర్కొంది. అందుకు ముఖ్య కారణం జట్టులో హనుమ విహారి లేకపోవడం. విహారి టెస్ట్ జట్టులో లేకుండా అతని స్థానంలో…
టీ-20 వరల్డ్ కప్ సూపర్-12లో జరిగిన తమ చివరి మ్యాచ్లో… వెస్టిండీస్పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై సౌతాఫ్రిక ఘన విజయం సాధించాయి. కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా సత్తా చాటి సెమీస్లో అడుగు పెట్టగా.. నెట్రన్రేట్ కారణంగా సౌతాఫ్రిక ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండూ బలమైన జట్లే. ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన ఇరు జట్లలో.. ఒకే టీంకు మాత్రమే సెమీస్లో చోటు దక్కింది. సమాన విజయాలతో సెమీస్ కోసం బరిలోకి దిగిన రెండు జట్లు.. తమ ప్రత్యర్థి…
ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ కనిపిస్తుంది. ప్రతి జట్టు దీనికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మోకాళ్లపైన కూర్చుంటుంది. అయితే వెస్టిండీస్ , సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ ఓ వివాదానికి తెర లేపింది. అయితే ఈ ప్రారంభ సమయంలో అందరూ మోకాళ్లపైన కూర్చోవాలని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు ఆ జట్టు బోర్డు సూచించింది. కానీ దాని ఆ జట్టు మాజీ…
టీ20 ప్రపంచకప్లో గ్రూప్-1లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన ఆ జట్టు.. రెండో మ్యాచ్లో వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ఓపెనర్ లూయిస్ (56) హాఫ్ సెంచరీతో రాణించినా.. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ పొలార్డ్ (26), సిమ్మన్స్ (16) పరుగులు చేశారు.…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొదట ఈ మహమ్మారికి వ్యాక్సిన్ను తయారు చేసింది మాత్రం రష్యానే. రష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు అత్యవసర వినియోగం కింద వినియోగిస్తున్నాయి. స్పుత్నిక్ వీ బూస్టర్ డోస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, మొదటి వ్యాక్సిన్ తయారు చేసిన రష్యాలోనే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య తగ్గిపోవడంతో కేసులు మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఈ…
టీ 20 ప్రపంచకప్ అసలు పోరు షురూ అయ్యింది. సూపర్-12 ఓపెనింగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్లు నమోదైనా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత ఉత్కంఠ లభించింది. అయితే ఒత్తిడికి చిత్తయిన దక్షిణాఫ్రికా చివరకు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అవుతుండటంతో పరుగులు సులభంగా రాలేదు. దీంతో పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హేజిల్ వుడ్,…