దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. డిసెంబర్ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య 16వేలకు చేరింది. దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ఆ దేశంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 86 వేలు దాటింది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల కిందట కోవిడ్ పాజిటివిటీ…
సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెలల్లో ఆ దేశానికి వెళాల్సిన టీం ఇండియా వెళ్తుందా.. లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ పర్యటన జరుగుతుంది అని ప్రకటించిన బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 న ప్రారంభం కానుండగా… చివరి వన్డే మ్యాచ్ జనవరి 23న ముగుస్తుంది. అలాగే ఈ పర్యటనలో టీ20 సిరీస్…
తమ దేశంలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. Read Also: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు. ఎప్పటి వరకు బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మొదట సౌతాఫ్రికాలో బయటపడింది. ఆ ఈ వేరియంట్ను గుర్తించిన వెంటనే సౌతాఫ్రికా అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం సౌతాఫ్రికా వెంటనే అలర్ట్ చేయడాన్ని ప్రశంసించింది. అయితే, మూడు రోజుల వ్యవధిలోనే 30 దేశాలకు కరోనా వ్యాపించడంతో దీని ప్రభావం ఎంతగా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. Read: రికార్డ్:…
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ముంబై లో జరగనున్న రెండో టెస్ట్ కోసం జట్టులో చేరాడు. అయితే ఈ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన కోహ్లీ… ఈ టెస్ట్ తర్వాత భారత జట్టు వెళాల్సిన సౌత్ ఆఫ్రికా పర్యటన గురించి స్పందించాడు. ఈ పర్యటన విషయంలో మా జట్టు మొత్తం నిరంతరం బీసీసీఐ తో టచ్ లోనే ఉన్నామని చెప్పాడు. త్వరలో ఏం…
సౌతాఫ్రికా లో బయటపడ్డ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సౌతాఫ్రికా లో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 28 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ గుర్తించిన తర్వాత కూడా… సౌతాఫ్రికా నుంచి.. విమానాలు నడిచాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడిలో భాగంగా పలు దేశాలు సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.. మరికొన్ని దేశాలు కోవిడ్ కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ…
కరోనా సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ భయాందోళనలు కలిగేలా చేస్తే, డెల్టా నుంచి బయటపడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. డెల్టా కంటే ఒమిక్రాన్ 6 రెట్లు ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒమిక్రాన్ను మొదట సౌతాఫ్రికాలో గుర్తించారు. ఆ తరువాత ఆ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇప్పుడు సౌతాఫ్రికాలో బయటపడుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ భాగం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జోహెన్స్బర్గ్లో నమోదవుతున్న కోత్త…
ఈ నెలలో భారత జట్టు వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటన పై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ప్రస్తుతం ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో అయితే ఈ పర్యటన కొనసాగుతోంది. కానీ…
న్యుజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ వచ్చే నెల 7న ముగిసిన తర్వాత భారత జట్టు 8 లేదా 9న సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళాల్సి ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో పరిస్థితి ఇంకా తీవ్రతరం కాకపోతే…
ఒమిక్రాన్ పేరు వింటే ప్రపంచం గజగజవణికిపోతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఒమిక్రాన్ను గుర్తించారు. ఆ తరువాత ప్రపంచాన్ని ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేయడంతో ఆన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. నిన్నటి రోజున జపాన్ వీదేశీయులపై నిషేదం విధించింది. ఇలా నిషేదం విధించిన మరుసటిరోజే జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం… అప్రమత్తమైన యంత్రాంగం… నమీబియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి ప్రభుత్వ నిబంధనల…