మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో ఇంకా…
IT Company Fraud: హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో బోర్డు తిప్పేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు.. అయితే, కనీసం ఆఫీస్ కూడా ఏర్పాటు చేయకుండానే.. నిరుద్యోగులకు కేటుగాళ్లు ఎర వేశారు.
సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై యువతలో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యోగులను నిలువనా ముంచేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.
IT company turned the board in Hi-Tech City: నిరుద్యోగులు మరోసారి మోసపోయారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ట్రైనింగ్ సహా ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లు గుంజిన సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకులు చేతులెత్తేశారు. దాంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి…
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సుమారు 1800 మంది ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు వేసింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం లక్షా 80 వేల మంది ఉద్యోగుల్లో సుమారు ఒక శాతం మందిపై వేటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతకాలం అనంతరం మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకోనుంది. కన్సల్టింగ్, కస్టమర్,…
మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి…