InnoHub Technologies: బోర్డ్ తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి చివరకు వారిని నట్టేట ముంచాయి. తాజాగా ఆ లిస్టులోకి మరో కంపెనీ యాడ్ అయ్యింది. మాదాపూర్ లో ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ పేరిట ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ అవుతుంది. ఉద్యోగం లేనివారికి మంచి అవకాశమని, రెండు లక్షలు కడితే జీవితం సెట్ అవుతుందని నిరుద్యోగులను నమ్మించారు.
ఇక వారు కూడా మంచి కంపెనీ అని నమ్మి రెండు లక్షలు కట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో సుమారు 20 కోట్లు వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కంపెనీ రెండు నెలలు వారికి ఎటువంటి అనుమానము రాకుండా జీతాలు ఇచ్చింది. ఇక రెండు వారాల క్రితం ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ తమ అధికారిక వెబ్సైట్, మెయిల్స్ ను బ్లాక్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఉద్యోగులు వెంటనే ఏమైందో అని ఆరాతీశారు. అయితే అప్పటికే కంపెనీ తట్టాబుట్టా సర్దుకొని చెక్కేయడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 800 మంది ఉద్యోగులు నడిరోడ్డుపై పడ్డారు. సంస్థపై ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని సోమవారం వారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో ఈ విషయం బట్టబయలు అయ్యింది.
Also Read
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!