Story Board: సోషల్ మీడియా శృతిమించిపోతోంది. వ్యక్తులు, సంస్థలు.. ఆఖరికి వ్యవస్థల్ని కూడా దాటేసి..ప్రభుత్వాలకూ తలపోటుగా తయారైంది. ఏకంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగి.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్న వారికి వార్నింగులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసింది. తెలంగాణలో సోషల్ మీడియా హద్దుదాటిన వారిపై రౌడీషీట్లు తెరవాలనే ఆదేశాలు వచ్చేశాయి. అటు ఏపీలో కూడా సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టం తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు జాతీయ స్థాయిలోనే ఓ సమగ్ర చట్టం అవసరమనే…
తెలంగాణ పోలీస్ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సైబర్ నెరగాళ్లతోపాటు సోషల్ మీడియాలో పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాను ఉపయోగించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియా కేంద్రంగా నేరాలకు పాల్పడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ద్వారా…
ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది.
Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో చాలా మంది ఏ స్థాయికైనా వెళ్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకే ముప్పు వచ్చేలా వ్యవహరించడానికీ కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే తాజాగా ఒక వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇకపోతే, ఆ వీడియోలో ఒక యువకుడు హెల్మెట్ ధరించి గొర్రె ముందు నిలబడ్డాడు. తర్వాత తన రెండు చేతులను నేలపై పెట్టుకుని, గొర్రెలా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదు. నిత్యం మీడియా ముందు కనిపించే ఆయన సడన్గా అదృశ్యమయ్యారు. దీంతో ఆయనకు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్లు త్వరలో ముంబైలోని తమ కొత్త బంగ్లాలోకి మారనున్నారు. రణబీర్ తాత రాజ్ కపూర్ కు చెందిన కృష్ణ రాజ్ ప్రాపర్టీలో నిర్మించిన ఈ ఆరు అంతస్తుల భవనానికి ‘కృష్ణ రాజ్’ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే రణబీర్ కూతురు రాహాతో కలిసి గృహప్రవేశం చేయాలని కుటుంబం భావిస్తోంది. అయితే, ఈ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో…
Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆమె బాడీని జూమ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది చూసిన బాలీవుడ్ నటి మిని మాథుర్ సదరు నెటిజన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు ఎంత ధైర్యం ఇలాంటి వీడియోలు పోస్టు చేయడానికి. అయినా కాజల్ ఎలా కనిపించాలో నువ్వు చెప్తావా. ఆమె బాడీ ఆమె…
Ananya Pande : హీరోయిన్లకు ట్రోల్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఏదో ఒక టైమ్ లో బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాను కూడా అలాంటి బాధితురాలినే అంటూ తెలిపింది అనన్య పాండే. లైగర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని…