Viral : భీమవరం సంక్రాంతి ఉత్సవాల్లో తీవ్ర కలకలం రేపుతున్న DSP వ్యాఖ్యలు
- భీమవరంలో డీఎస్పీ మాస్ కామెంట్స్
- "ఆ ఊపు ఎక్కడ?" అంటూ స్టేజీపై సెటైర్లు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- పండుగ సంబరాల్లో హైలైట్గా నిలిచిన ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. అయితే, ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన వ్యాఖ్యలే. పోలీస్ యూనిఫాంలో వేదికపైకి ఎక్కిన ఆయన, తనలోని కళా హృదయాన్ని బయటపెడుతూ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భీమవరం సంక్రాంతి సంబరాల్లో అసలు ఊపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వేదికపై మైక్ అందుకున్న డీఎస్పీ రఘువీర్, ప్రేక్షకుల నిస్తేజంపై సూటిగా స్పందించారు. “భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపించట్లేదు.. అసలు ఆ ఊపు లేదు, ఆ కేక లేదు” అని ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. సంక్రాంతి అంటేనే ఉత్సాహం, కేరింతలు ఉండాలని, కానీ ఇక్కడ ప్రేక్షకులు సైలెంట్గా ఉండటం తనకు నచ్చలేదని ఆయన సరదాగా మందలించారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
డీఎస్పీ ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా సినిమా పాటలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు నవ్వులు పూయించాయి. “ఓరోరి యోగి నన్ను కుదిపేయరా అంటూ డాన్సర్ పాడుతుంటే, కనీసం ఎవరూ కుదుపుకోకపోతే ఎలాగయ్యా?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ‘కుర్చీ మడతపెట్టి’ పాటను ఉద్దేశించి.. “ఆమె అక్కడ కుర్చీ మడతపెడుతుంటే, కనీసం ఎవరూ మడతపెట్టకపోతే ఎలా?” అంటూ ఆవేదనతో కూడిన ప్రశ్నలు సంధించారు.
డీఎస్పీ రఘువీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు స్టేజీపై ఉన్న తోటి అధికారులు, ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయనలోని ఉత్సాహాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలతో సందడి చేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా, ప్రజలతో మమేకమవుతూ ఆయన చేసిన ఈ ‘మాస్’ ప్రసంగం భీమవరం పండగ సంబరాల్లో హైలైట్గా నిలిచింది. మొత్తానికి, భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ, “డీఎస్పీ గారు మామూలోడు కాదు.. భలే కుదిపేశారు!” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!