ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా... సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి.
ఎలోన్ మస్క్ కి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ "X" (గతంలో ట్విటర్) అధికారికంగా దాని కంటెంట్ విధానాలలో మార్పును ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం అశ్లీల వీడియోలు పోస్టు చేసేందుకు అనుమతించింది. ఇది NSFW (పని కోసం సురక్షితం కాదు) కంటెంట్కు ప్లాట్ఫారమ్ విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్న డీజీపీ.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ ట్విట్టర్ను పాకిస్థాన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. బుధవారం ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.
వెరిఫైడ్ వినియోగదారులకు మాత్రమే నెలకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించిన మస్క్... ఇప్పుడు ట్విట్టర్ యూజర్లందరికి ఛార్జ్ వసూలు చేయాలని భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సంస్థ కీలక ఉద్యోగులతో మస్క్ చర్చించినట్లు తెలుస్తోంది.