విశ్వనటుడు కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఫస్ట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిన్నపాటి వీడియోను విడుదల చేస్తూ మూవీకి గుమ్మడికాయ కొట్టినట్టు చెప్పారు. విశేషం ఏమంటే… ఈ బుల్లి వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతున్న విజువల్ ఉంది. అనంతరం ఫహద్ ఫాజిల్ దర్శకుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను మేకర్స్ షూట్…
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి తెలుగుతెరపై మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్…
ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా దిల్రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్తో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న పక్కా యూత్ ఎంటర్టైనర్ ‘రౌడీ బాయ్స్’. అన్ని ఎలిమెంట్స్ను డైరెక్టర్ శ్రీహర్ష పక్కాగా, చక్కగా బ్లెండ్ చేసి…
నటసింహ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను తాజా చిత్రం అఖండ.. కరోనా వేవ్ తర్వాత వేగంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ నిన్న ముగిసింది. కాగా, నేడు చిత్రబృందం కాస్త రిలాక్స్ అవుతూ పార్టీ చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. కాగా దీపావళి సందర్బంగా ఈ చిత్ర రానున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య…
అందాల తార, స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి కుమార్తె అర్హ బుల్లి భరతుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతే ఘనంగా వీడ్కోలు పలికింది. విశేషం ఏమంటే… అల్లు అర్జున్ తన కుమార్తె కోసం అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఫాల్కన్ ను కొద్ది రోజుల పాటు ఆమెకే కేటాయించాడు.…
ఇండియన్ స్క్రీన్ పై ఒకే ఒక క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో తీసిన సినిమా ‘105 మినిట్స్’. ఉత్కంఠ భరితంగా సాగే కథ కధనం తో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో హన్సిక కథానాయిక. ‘సింగిల్ షాట్’ లో ‘సింగిల్ క్యారెక్టర్ తో రీల్ టైమ్ రియల్ టైమ్ గా తీసిన సినిమా ఇది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలో ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ మొత్తం జరిగింది. షూటింగ్ పూర్తయింది.…
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, హైదరాబాద్ బ్యూటీ రీతూవర్మ జంటగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా లొకేషన్ లో డైరెక్టర్ తో హీరోహీరోయిన్లు కలిసి ఉన్న…
సన్నీ లియోన్ థ్రిల్లింగ్ కెరీర్ కి మరో థ్రిల్లర్ మూవీ జతైంది. ఆమె తమిళ చిత్రం ‘షేరో’ షూటింగ్ పూర్తి చేసింది. చివరి రోజు ప్యాకప్ సందర్భంగా క్లాప్ బోర్డ్ తో సహా డైరెక్టర్ శ్రీజిత్ విజయన్ తో కెమెరాకు ఫోజిచ్చింది. అయితే, సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ‘షేరో’లో ఆమె క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈమేరకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్ లేడీగా సన్నీ కనిపించబోతోంది. ఇండియాకి వచ్చిన ఆమెకు…
‘ఉప్పెన’ లాంటి ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా, కరోనా లాక్ డౌన్ తరువాత కృతి పాప షూటింగ్ కి జాయిన్ అవుతోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కాగా నేడు కృతిశెట్టి ఈ…