నటసింహ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను తాజా చిత్రం అఖండ.. కరోనా వేవ్ తర్వాత వేగంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ నిన్న ముగిసింది. కాగా, నేడు చిత్రబృందం కాస్త రిలాక్స్ అవుతూ పార్టీ చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. కాగా దీపావళి సందర్బంగా ఈ చిత్ర రానున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.