‘ఉప్పెన’ లాంటి ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా, కరోనా లాక్ డౌన్ తరువాత కృతి పాప షూటింగ్ కి జాయిన్ అవుతోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కాగా నేడు కృతిశెట్టి ఈ షూటింగులో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ గా వస్తున్నా ఈ చిత్రం.. ఇదివరకు విడుదల చేసిన టైటిల్ ప్రోమో ఆసక్తిని రేపింది. కృతి ఈ సినిమాతో పాటుగా రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలోను త్వరలోనే జాయిన్ కానుంది. నానితోను ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలోను ఈ బ్యూటీ నటిస్తున్న విషయం తెలిసిందే.