తమిళంలో విజయం సాధించిన 'చేరన్ పాండియన్' సినిమా ఆధారంగా రూపొందిన 'బలరామకృష్ణులు' కూడా రవిరాజా దర్శకత్వంలో వెలుగు చూసిందే. ఈ చిత్రం 1992 నవంబర్ 7న జనం ముందు నిలచింది.
నటభూషణ శోభన్ బాబు, లక్ష్మి జంటగా రూపొందిన పలు చిత్రాలు జనాన్ని రంజింప చేశాయి. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వారిద్దరూ నటించిన ‘ప్రేమమూర్తులు’ కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో మరో నాయికగా రాధ నటించారు. ఓ కీలక పాత్రలో మురళీమోహన్ కనిపించారు. శ్రీరాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిద్దే రామారావు నిర్మించారు. 1982 ఏప్రిల్ 21న విడుదలైన ‘ప్రేమమూర్తులు’ మంచి విజయం సాధించింది. కథ విషయానికి వస్తే- గోపాలరావు అనే ధనికుని కూతురు జ్యోతి. మెడిసిన్…
ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’పైనే సినీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 36 ఏళ్ళ తరువాత వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో ఆ చర్చ మరింతగా మురిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్స్ లో ఓ సీనియర్ స్టార్ తో తరువాతి తరం స్టార్ హీరో నటించారు తప్ప, సమకాలికులు, సమ ఉజ్జీలయిన స్టార్స్ కలసి నటించలేదు. అది రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’తోనే సాధ్యమైంది. ఇందులో నవతరం అగ్రకథానాయకులైన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్…
ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు.…
సంక్రాంతి సంబరాల్లో కొత్త సినిమాల సందడే వేరు. పొంగల్ కు కొత్తబట్టలు కట్టుకోవడం ఎంత ఆనందమిస్తుందో, కొత్త చిత్రాలు చూసి మురిసిపోవడంలోనూ అంతే ఆనందం చూస్తుంటారు జనం. దానిని దృష్టిలో పెట్టుకొనే టాప్ హీరోస్ అందరూ సంక్రాంతికి తమ చిత్రాలను జనం ముందు నిలపాలని తపిస్తూ ఉంటారు. 1987లో నాటి స్టార్ హీరోస్ కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు తమ చిత్రాలను ఒకే రోజున అంటే జనవరి 14న విడుదల చేయడం విశేషం!…
రచయితలుగా పరుచూరి బ్రదర్స్ తెలుగునాట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక వారు దర్శకులుగా మారి ఓ తొమ్మిది చిత్రాలు రూపొందించారు. ‘కాయ్ రాజా కాయ్’ అంటూ మెగా ఫోన్ పట్టిన ఈ బ్రదర్స్, సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ‘శ్రీకట్న లీలలు’కు కూడా దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరో ఆరేళ్ళకు అదే సంస్థలో శోభన్ బాబు ప్రధాన పాత్రలో ‘సర్పయాగం’ రూపొందించారు. ఇందులో శోభన్ కు రోజా కూతురుగా నటించడం విశేషం.…
(సెప్టెంబర్ 3న జమున ‘బంగారుతల్లి’కి 50 ఏళ్ళు) కళారంజని జమున అభినయ పర్వంలో మరపురాని చిత్రాలు అనేకం. వాటిలో ‘బంగారుతల్లి’ మరింత ప్రత్యేకం. హిందీలో నర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మదర్ ఇండియా’ ఆధారంగా ‘బంగారు తల్లి’ తెరకెక్కింది. ‘మదర్ ఇండియా’ టైటిలే జనాన్ని విశేషంగా అలరించింది. ఇక ఆ సినిమా పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. ఆ చిత్ర దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ 1940లోనే ‘ఔరత్’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో భర్త చనిపోయి, ఇద్దరు…