Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News 40 Years For Prema Muhurthallu Movie

40 Years for Prema Muhurthallu : నలభై ఏళ్ళ ‘ప్రేమమూర్తులు’

Published Date :April 21, 2022 , 6:00 am
By Subbarao N
40 Years for Prema Muhurthallu : నలభై ఏళ్ళ ‘ప్రేమమూర్తులు’
  • Follow Us :
  • google news
  • dailyhunt

నటభూషణ శోభన్ బాబు, లక్ష్మి జంటగా రూపొందిన పలు చిత్రాలు జనాన్ని రంజింప చేశాయి. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వారిద్దరూ నటించిన ‘ప్రేమమూర్తులు’ కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో మరో నాయికగా రాధ నటించారు. ఓ కీలక పాత్రలో మురళీమోహన్ కనిపించారు. శ్రీరాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిద్దే రామారావు నిర్మించారు. 1982 ఏప్రిల్ 21న విడుదలైన ‘ప్రేమమూర్తులు’ మంచి విజయం సాధించింది.

కథ విషయానికి వస్తే- గోపాలరావు అనే ధనికుని కూతురు జ్యోతి. మెడిసిన్ చదువుతూ ఉంటుంది. తాను కోరుకున్నది తనకు దక్కాలని తపించే అమ్మాయి. కిరణ్ ఓ మధ్య తరగతి కుర్రాడు. అనాథ అయిన మురళిని చేరదీస్తాడు కిరణ్. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కిరణ్, జ్యోతి ప్రేమించుకుంటారు. వారి ప్రేమను తొలుత ఆమె తండ్రి కాదన్నా, ఆమె పట్టుదల చూసి చివరకు అంగీకరిస్తాడు. పెద్ద పార్టీ ఏర్పాటు చేసి మరీ తన కాబోయే అల్లుడిగా కిరణ్ ను మిత్రులకు పరిచయం చేస్తాడు. పైచదువులకు జ్యోతి విదేశాలకు వెళ్తుంది. వచ్చాక కిరణ్, జ్యోతి పెళ్ళి అనుకుంటారు. రాధ పెళ్ళి చేయడమే ఆమె తల్లికి ఉన్న పెద్ద బాధ్యత. రాధను ఆమె ఊళ్ళోనే జులాయి వెధవ నామాల నారాయణ ప్రేమిస్తాడు. ఆమె చీకొట్టడంతో పగబడతాడు. రాధ దురదృష్టజాతకురాలనీ, ఆమెను పెళ్ళాడితే పైకి పోవలసిందే అంటూ ప్రచారం చేస్తూ పెళ్ళి కాకుండా చేస్తుంటాడు. ఇవేవీ లెక్క చేయని మురళి, రాధను పెళ్ళాడతానంటాడు. పెళ్ళి సమయానికి మురళికి యాక్సిడెంట్ అవుతుంది. చనిపోయే ముందు మిత్రుడు కిరణ్ తో “ధనవంతురాలయిన జ్యోతిని ఎవరైనా పెళ్ళి చేసుకుంటారని, రాధను పెళ్ళాడి ఆమెకు జీవితం ప్రసాదించమని” కోరతాడు మురళి. మిత్రుడంటే ప్రాణం పెట్టే కిరణ్ అందుకు అంగీకరించి, రాధను పెళ్ళాడతాడు. విదేశాల నుండి ‘పిడియాట్రిషియన్’గా తిరిగి వచ్చిన జ్యోతికి ఈ విషయం తెలిసి గగ్గోలు పెడుతుంది. తరువాత నుంచీ కిరణ్ పై పగ పెంచుకుంటుంది. అతనికి నిలువ నీడలేకుండా చేస్తుంది. చివరకు కిరణ్ కొడుకు పసివాడికి వైద్యం చేయలేకపోతుంది. కానీ, ఆ పసివాడు బాగోలేడన్న విషయం జ్యోతికి తెలియకుండా ఓ నీచుడు అడ్డు పడి ఉంటాడు. నిజంగానే తనకు తెలియదని చెబుతుంది చివరకు తండ్రి కూడా నమ్మడు. దాంతో ఆ పసివాడు చనిపోతాడు. ఆ సమయంలో కిరణ్, జ్యోతిని నానా మాటలు అంటాడు. మనిషివే కాదనీ అని వెళ్ళిపోతాడు. గోపాలరావు కూడా ఎంతో బాధపడి, అప్పుడు జ్యోతికి అసలు విషయం చెబుతాడు. “చిన్నప్పటి నుంచీ నిన్ను ఐశ్వర్యంలో పెంచడమే తన తప్పని, దుర్మార్గంగా కిరణ్ ను కష్టాల పాలు చేస్తున్నా అడ్డుకోకపోవడమూ తన తప్పేనని అంటాడు. అన్నిటినీ మించి, పిల్లలు లేని తాను అనాథవైన నిన్ను చేరదీయడం మరింత తప్పనీ చెబుతాడు. ” దాంతో జ్యోతిలో మానవత్వం చిగురిస్తుంది. రాధ చనిపోవాలనుకుంటుంది. ఆమెను జ్యోతి కాపాడి ప్రాణం పోస్తుంది. కిరణ్ జీవితానికి దూరంగా వెళతానని చెప్పి విదేశాలకు వెళ్తుంది జ్యోతి. ఆమె మంచితనం తెలుసుకున్న కిరణ్, రాధ ఎయిర్ పోర్ట్ లో ఆమెకు చివరి సారిగా వీడ్కోలు పలకడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, హేమసుందర్, కె.కె.శర్మ, మల్లాది, ధమ్, కొడాలి ఉమామహేశ్వరరావు, నిర్మల, ఝాన్సీ, జయలత, శ్రీలక్ష్మి తదితరులు నటించారు. ఈ చిత్రానికి భీశెట్టి లక్ష్మణరావు కథను సమకూర్చగా, సత్యానంద్ మాటలు రాశారు. చక్రవర్తి బాణీలకు ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, వేటూరి పాటలు పలికించారు. “చెంపకు చారెడు కళ్ళు….”, “మావారు బంగారు కొండ…”, “సిరిసిరి మువ్వల నవ్వు…”, “తారక చెప్పదు ఏ నాడూ…”, “చిటారు కొమ్మన చిన్నారి గువ్వల గూడుంది…”, “ఊరుకో… ఏడవకు ఊరుకో…” వంటి పాటలు అలరించాయి.

ఈ సినిమా కథ చూస్తే, 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాలో గుమ్మడి, జమున ఎపిసోడ్ గుర్తుకు రాకమానదు. అదే అంశమే అయినా, దీనిని కోదండరామిరెడ్డి అప్పటి ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kodanda rami reddy
  • Lakshmi
  • premamuhurtham
  • shoban Babu
  • Telugu old movies

తాజావార్తలు

  • Poco X8 Pro: పోకో X8 Pro సిరీస్ వచ్చేసింది.. 9000mAh బ్యాటరీ + 100W ఛార్జింగ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

  • US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు

  • JC Prabhakar Reddy Emotional: కన్నీరు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

  • PM Vidya Lakshmi: పీఎం-విద్యా లక్ష్మి యోజన అంటే ఏమిటి? హామీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఎలా పొందాలి?

  • Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి

ట్రెండింగ్‌

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions