మొత్తానికి రెండ్రోజుల ఒడుదుడుకులకు ఫుల్ స్టాప్ పడింది. బుధవారం స్టాక్ మార్కెట్లలో సానుకూల పవనాలు వీచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగాయి
తాజా రాజకీయ పరిణామాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపిస్తోంది. రెండ్రోజుల నుంచి సూచీల్లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్లాట్గా ప్రారంభమైన సూచీలు.. అదే ఒరవడిని కొనసాగించాయి.
Stock Market Record: భారత స్టాక్ మార్కెట్లో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కొత్త ఊపును పొందింది. సెన్సెక్స్ తొలిసారిగా 77,000ను అధిగమించగా, నిఫ్టీ 23400 స్థాయిని దాటి చారిత్రక శిఖరానికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు.. అనంతరం సూచీలు పుంజుకుంటూ లాభాల్లో కొనసాగాయి. ఇక సెన్సెక్స్ తాజాగా ఆల్-టైమ్ హై లెవల్ కొనసాగింది.
దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 692, నిఫ్టీ 201 పాయింట్లు పెరిగాయి. ఈ వారంలో షేర్ మార్కెట్ రెండు సార్లు రికార్డులు సృష్టించింది. సోమవారం రోజున మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. మంగళవారం రోజున మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ఒడిదుడుకులకు ఎన్నికల ఫలితాలే కారణం. బుధ, గురువారాల సెషన్లలో స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగింది. కాగా.. భారీ…
స్టాక్ మార్కెట్లలో వరుస జోరు కొనసాగుతోంది. బుధవారం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. గురువారం కూడా అదే జోష్ కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.
నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలాడిపోయారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలు నమోదు అయిన రోజుగా రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. అయితే…
Stock Market Today : 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న స్టాక్ మార్కెట్కు ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎన్డీయే కూటమి తొలి ట్రెండ్స్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి.
ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది.