కరోనా సెకండ్ వేవ్లో కేసులు తక్కువగా నమోదవుతున్నా, ఇంకా పూర్తిగా నియంత్రలోకి రాలేదు. మొదటి వేవ్లో ఆల్ఫారకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందితే, రెండో దశలో డెల్టావేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని, సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఈ డెల్టా వేరియంట్ కు వ్యాప్తిచెందే గుణం అధికంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇలాంటి సమయంలో సెకండ్ వేవ్ తొలగిపోయిందని అనుకోవడం పోరపాటే అని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని తెలియజేసింది. నిబంధనలు ఉల్లంఘించి…
కరోనా కట్టడి చర్యల కోసం కేంద్రం… 6 రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ బృందాలను పంపినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లాయి. కరోనా కట్టడిని తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ముఖ్యంగా నిఘా, కరోనా నిరోధక చర్యలు, పరీక్షలు, కోవిడ్ నిబంధనావళి అమలు, ఆసుపత్రి పడకలు, అంబులెన్స్, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ వంటి సౌకర్యాలను సమీక్షిస్తారని నీతి…
దేశంలో సెకండ్వేవ్ ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పడుతున్నది. వేగంగా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ సమయంలో మరో న్యూస్ అందరిని భయపెడుతున్నది. ఇటీవల చెన్నై జూలో రెండు సింహాలు వైరస్తో మృతి చెందాయి. దీంతో సెంట్రలో జూ అధికారులు అప్రమత్తం అయ్యారు. జంతువులకు కరోనా టెస్టులు చేయాల్సిన విధానంపై చర్చించారు. జూలోని జంతువులకు మాత్రమే కాకుండా ఇంట్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉండటంతో మార్గదర్శకాలను రిలిజ్ చేశారు. వైరస్ బారిన పడిన జంతువులను…
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “నారప్ప” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్” తెలుగు రీమేక్ ఈ చిత్రం. ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అవార్డు గెలుచుకున్న నటి ప్రియామణి వెంకీ భార్యగా నటించింది. దీనిని వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో కలైపులి ఎస్ థాను, డి సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఈ ఏడాది…
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై ప్రభావం భారీగానే పడింది. దీని కారణంగానే థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంటే ఏప్రిల్ రెండవ వారం నుంచి తెలంగాణలో థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు క్లోజ్ అయ్యి దాదాపు రెండు నెలలు అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో థియేటర్లు మళ్ళీ తెరుచుకునే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణలో జూన్ 19 వరకు లాక్ డౌన్…
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. అలాగే కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్ ప్రక్రియ ఉండనున్నట్లు తెలిపారు. కరోనాను అంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన…
దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. కాగా ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్న డాక్టర్లు కూడా మృత్యువాత పడటం కలిచివేస్తుంది. కరోనా మొదటి వేవ్లో 730 మంది డాక్టర్లు మృతి చెందగా, సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు 244 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే సెకండ్ వేవ్లో 69 మంది డాక్టర్ల…
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. తాజాగా ఇండియాలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది. ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు…