ఉక్రెయిన్పై మిలటరీ ఆపరేషన్కు దిగుతున్నట్లు రష్యా ప్రకటించిన వెంటనే సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై పేలుళ్లు జరిపాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బలగాలు ఆక్రమించాయి. బోరిస్పిల్ ప్రాంతంలోనూ బాంబు దాడులు జరిగినట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్లో అతిపెద్ద రెండో నగరం ఖార్కివ్నూ రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. మరోవైపు మరియపోల్, దినిప్రో, క్రమటోర్ప్క్, ఒడెస్సా, జపోర్గియా నగరాల్లోనూ రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.…
ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగడంపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్పై రష్యా దాడులను ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా అన్యాయంగా దాడి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్లో జరిగే పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని.. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు. రష్యా దాడులకు ప్రతి చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.…
ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్ను రష్యా ప్రకటించింది. డోన్బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశ చర్యల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో కూడా ఊహించని…
ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు. ఈ నేపథ్యంలో కైవ్లోని తన రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం నాటికి,…
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం తారా స్థాయికి చేరింది. అమెరికా ఆశపడ్డట్టు ఉక్రెయిన్పై రష్యా ప్రత్యక్ష దాడి చేయలేదు. కానీ, అంతకు మించిన షాక్ ఇచ్చింది ప్రపంచ పెద్దన్నకు. పుతిన్ దురాక్రమణకు దిగాడని అమెరికా గగ్గోలు పెడుతోంది. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ప్రెసిడెంట్ బైడెన్ ఆరోపించారు. ఆంక్షల పర్వానికీ అమెరికా తెరలేపింది. రష్యాకు చెందిన ఆర్థిక సంస్థలు వీఈబీ, రష్యా మిలిటరీ బ్యాంక్పై ఆంక్షలు విధించింది. అలాగే అక్కడి ఉన్నత వర్గాలు, వారి కుటుంబాలపై కూడా ఆంక్షలు పెట్టనుంది.…
ఉక్రెయిన్ రష్యా మధ్య బోర్డర్ సమస్యలు పెద్ద యుద్దవాతారవణం నెలకొన్నది. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ఈరోజు ఉదయం 200 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. మూడు విమానాల్లో వీరిని తరలించారు. గురు, శనివారాల్లో మరో రెండు విమానాలు ఉక్రెయిన్కు వెళ్లనున్నాయి. Read: Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన…
ఉక్రెయిన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. రష్యా అనుకూల వేర్పాటువాదులు ప్రాబల్యం అధికంగా ఉన్న రెండు ప్రాంతాలను రష్యా స్వతంత్ర దేశాలుగా ప్రకటించింది. అందేకాదు, ఆ రెండు దేశాల్లో శాంతి పరిరక్షణ కోసం రష్యా తన సైన్యాన్ని పంపేందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రష్యా సైనిక డిక్లరేషన్పై పుతిన్ సంతకం చేశారు. అటు రష్యన్ పార్లమెంట్ సైతం దీనిని ఆమోదించడంతో సైనిక బలగాలు ఉక్రెయిన్ గడ్డపై అడుగుపెట్టబోతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అయ్యాయి. ఉక్రెయిన్లోని రెండు…
ఉక్రెయిన్- రష్యా సరిహద్దుల్లో పరిస్థితులు చేజారిపోయేలా కనిపిస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా తగ్గేదిలే రష్యా చెబుతున్నది. ఉక్రెయిన్ లోని ప్రత్యేక వేర్పాటువాదుల ప్రాంతాలను రెండు స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తిస్తు డిక్లరేషన్పై సంతకం చేసింది. ఉక్రెయిన్ను నిర్వీర్యం చేసి పూర్తిగా దానిని రష్యాలో కలుపుకోవడమే లక్ష్యంగా పుతిన్ ఎత్తులు వేస్తున్నారు. Read: Electric Vehicles: నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు… అయితే, ఉక్రెయిన్కు నాటో, యూరప్తో పాటు అమెరికా సపోర్ట్ చేస్తున్నది. అమెరికా తన బలగాలను పోలెండ్కు పంపిన…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. ఉక్రెయిన్లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ డిక్లరేషన్పై సంతకం చేయడంతో పరిస్థితులు దిగజారాయి. రష్యాతో ఉన్న అన్ని రకాల సంబంధాలను ఉక్రెయిన్ తెగతెంపులు చేసేసుకున్నది. రెండు స్వతంత్ర దేశాలల్లో శాంతిని పరిరక్షించడం కోసం రష్యా తన సైన్యాన్ని ఆ రెండు దేశాలకు పంపింది. పదేళ్లపాటు రెండు దేశాల్లో రష్యా దళాలు ఉంటాయి. స్వతంత్ర ప్రాంతాలతో పాటు రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకుంటుందనే సంకేతాలు…
స్టాక్ మార్కెట్లకు యుద్ధ భయం పట్టుకున్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్ని సందిగ్ద పరిస్థితులు మార్కెట్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గత నాలుగు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు కుప్పకూలడంతో ఆందోళన మదుపురుల్లో ఆందోళన మొదలైంది సెన్సెక్స్ 382.91 పాయింట్ల నష్టపోయి 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు కోల్పోయి 17,092.20 పాయింట్ల వద్ద ముగిసింది. Read: Debate: పాక్ ప్రధాని బంపర్ ఆఫర్… మోడీతో…