అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్పై యుద్ధం ముగించాలంటూ పుతిన్కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.
India–Russia Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ను మరోసారి ప్రశంసించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని చెప్పుకొచ్చారు. భారత్ ఓ గొప్ప దేశం.. వారితో మా సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామన్నారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేదన్నారు కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పురి.
Russia - Ukraine Conflict: ఉక్రెయిన్పై యుద్ధానికి సపోర్టుగా ఉత్తర కొరియా, రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను తరలించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కిమ్ సైనికుల్లో కొందరు చనిపోయారని వ్లొదిమీర్ జెలెన్స్కీ తాజాగా వెల్లడించారు.
రష్యాతో సైనిక సంబంధాల కారణంగా పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా, దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికాతో మాట్లాడుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భారతీయ కంపెనీలు రష్యా సైనిక-పారిశ్రామిక స్థాపనకు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయమై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా పైకి క్షిపణులు ప్రయోగించడానికి తమ మిత్ర దేశాలు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. రష్యాకు మద్దతుగా మోహరించిన నార్త్ కొరియా సేనలను ధీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులే ప్రయోగించాలన్నారు.
Zelensky: ఉక్రెయిన్పై యుద్ధానికి సపోర్టుగా నార్త్ కొరియా రష్యాకు భారీగా సైనికులను తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా బలగాలు మాస్కో్కి చేరడంపై చైనా మౌనం వహించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు.
India Russia: ఇండియా రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ, ఆయుధాలు, ఎరువులు, చమురు వంటి వాటి భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్ధాలుగా రష్యా భారత్కి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటోంది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ రష్యా సంబంధాలను చరిత్రను పరిశీలిస్తే, రష్యా భారత ప్రయోజనాలకు విరుద్ధంతా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు.
ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.
Cyber Attack On Russia: రష్యాలోని కజాన్లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్దాడికి లక్ష్యంగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై బుధవారం నాడు ఉదయం వివిధ విదేశాల నుంచి భారీ సైబర్ ఎటాక్ ప్రారంభమైంది.…