Ukraine War: ఏడాదిన్నర కాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా భావించారు.
Ukraine War: ఏడాదిన్నరగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, అమెరికా ఆంక్షలకు భయపడకుండా పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుంది తెలుసు. ఏకంగా ఆస్కార్కి నామినేట్ అయి అవార్డును సైతం సొంతం చేసుకుంది. నాటు నాటు పాట డ్యాన్స్ ను దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది.
Ukraine War: ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఉక్రెయిన్ నగరం బఖ్ముత్ ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ బలగాలకు, ప్రైవేట్ కిరాయి సైన్యం వాగ్నర్ ను అభినందించారు. యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది.
PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో సమావేశం అయ్యారు. శనివారం జపాన్లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు మోడీ, జెలెన్ స్కీ టెలిఫోన్లలో మాత్రమే సంభాషించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మంగళవారం రష్యా జరిపిన క్షిపణి దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 18 క్షిపణులను కూల్చివేశాయని ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. యూఎస్ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్తో అర డజను రష్యన్ హైపర్సోనిక్ క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.
Russia: రష్యా అధ్యక్షుడిని హతమార్చేందుకు డ్రోన్లను ప్రయోగించిన కొద్ది రోజుల తర్వాత రష్యాలో మరో ప్రముఖుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ రష్యన్ జాతీయవాద రచయిత, జఖర్ ప్రిలేపిన్ ని శనివారం కారుబాంబుతో హతమార్చాలని చూశారు. ఈ ఘటనలో ఆయన గాయపడగా.. కారు నడుపుతున్న డ్రైవర్ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్ తరుపున తాను పనిచేస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు.
Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. బుధవారం ఉక్రెయిన్ లోని దక్షిణ ఖేర్సన్ ప్రాంతంపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 21 మంది మరణించడంతో పాటు 48 మంది గాయపడ్డారు. శుక్రవారం నుండి ప్రధాన నగరమైన ఖెర్సన్లో అధికారులు కర్ఫ్యూ విధించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది.