Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో టర్నింగ్ పాయింట్.. కీలక నగరం రష్యా వశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఉక్రెయిన్ నగరం బఖ్ముత్ ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ బలగాలకు, ప్రైవేట్ కిరాయి సైన్యం వాగ్నర్ ను అభినందించారు. యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది. 70,000 మంది జనాభా ఉన్న ఈ బఖ్ముత్ పై పట్టుకోసం రష్యా గతేడాది నుంచి ప్రయత్నిస్తోంది. ఈ నగరం రష్యా వశం కాకుండా ఉక్రెయిన్ కూడా భారీ స్థాయిలో ప్రతిఘటిస్తోంది.
Read Also: Centre vs AAP: ఆప్కు మద్దతుగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో సీఎం నితీష్ కుమార్..
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
బఖ్ముత్ పట్టణంపై పట్టు కోసం ఇరు దేశాల సైనికులు భారీ స్థాయిలో ప్రాణాలను కోల్పోయారు. వెస్ట్రన్ దేశాలు ఇస్తున్న ఆర్థిక, సైనిక సాయంతో ఉక్రెయిన్ ఇన్నాళ్లుగా రష్యాను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల నుంచి రష్యన్ సైనికులు వెనక్కి తగ్గేలా చేసింది. అయితే తాజాగా బఖ్ముత్ పట్టణం రష్యా వశం కావడం యుద్ధానికి టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నారు. ఈ నగరం రష్యా చేతికి చిక్కితే డాన్ బాస్ లోని మరిన్ని ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరించారు.
బఖ్ముత్ పట్టణం రష్యా వశం కావడంతో ఇది ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి వెళ్లేందుకు ఓ రహదారిగా మారతుందని ఉక్రెయిన్ కలవరపడుతోంది. ఇదే జరిగితే క్రమంగా రాజధాని కీవ్, ఇతర ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. జీ-7 దేశాల సదస్సు జపాన్ లో జరుగుతోంది. ఈ సమావేశాలకు జెలెన్స్కీ కూడా వచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో ఆదివారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు రష్యా, బఖ్ముత్ సొంతమైనట్లుగా ప్రకటించింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!