ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. 50 రోజులు గడిచినా యుద్ధం ఆగడం లేదు.. ఇక, రష్యా బలగాలకు ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది.. తాజా దాడుల్లో కీవ్, ఖెర్సన్, ఖార్కివ్ మరియు ఇవానో-ఫ్రాన్కివ్స్క్ లాంటి నగరాల్లో భారీ నష్టం జరిగినట్టు చెబుతున్నారు.. మరోవైపు.. ఉక్రెయిన్ను మేం ఉన్నామంటూ ప్రకటిస్తూ వస్తున్న అమెరికా.. ఆ దేశానికి భారీ సాయం చేసింది.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్కు మరో 80కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని…
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న ఆయన భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఖైబర్ ఫక్తూన్వాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ ఖాన్.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నారు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండటం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక, భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ…
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా ఆంక్షలను లెక్కచేయడంలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించడంలేదు. న్యాయస్థానం తీర్పును తాము పరిగణలోకి తీసుకోవడంలేదంటూ రష్యా ప్రకటించింది. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు అని స్పష్టంచేసింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. నగరాల్లో నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది. విధ్యంసం చేస్తోంది. పోలండ్ సరిహద్దులకు అత్యంత చేరువగా ఉన్న లీవ్ నగరం ఇప్పటివరకు పెద్దగా రష్యా దాడులకు…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్పై సైనిక ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన…
ఉక్రెయిన్ను హస్తగతం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తోంది. ప్రధాన నగరాలపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఏకధాటిగా బాంబులు, మిసైల్స్ తో నివాస భవనాలపై దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం సైతం ఆ దాడులను సమర్థంగా ఎదుర్కొంటోంది. రష్యా విధ్వంసం సృష్టించడంతో మరియుపోల్ సిటీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శిథిల భవనాలు, వాటి నుంచి విడుదలవుతున్న పొగతో శ్మశాన వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఉక్రెయిన్పై దాడులు నిర్వహిస్తున్న రష్యా..…
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని…
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. సామాన్యులకు అందనంత ఎత్తుకు ధరలు ఎగబాకుతున్నాయి.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. కమోటిటీ ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 54 వేల మార్క్ ను తాకింది. ఇంట్రాడేలో 54,190 రూపాయలకు వెళ్లింది. 24 క్యారెట్ల తులం బంగారం.. ఆల్ టైమ్ గరిష్టానికి 2వేల దూరంలో నిలిచిపోయింది. 2020 ఆగస్టులో 56,191 రూపాయలను తాకింది. ఇప్పటివరకు ఇదే జీవితకాల…
ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది రష్యా.. ఇరు దేశాల మధ్య యుద్ధం పదో రోజుకు చేరుకోగా… రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపిస్తూ.. విరుచుకుపడుతున్నాయి పుతిన్ సేనలు.. అయితే, యుద్ధంలో ఇప్పటి వరకు 10,000 మంది రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 10వ రోజులోకి ప్రవేశించిగా.. 10,000 మంది రష్యన్ సైనికులు మరణించారని పేర్కొన్నారు జెలెన్స్కీ… అయితే, ఉక్రెయిన్ తన సాయుధ బలగాల మరణాల గణాంకాలను…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం పదో రోజుకు చేరుకుంది… ఐదున్నర గంటల తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ భీకర యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానం అన్నారు పుతిన్.. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.. ఉక్రెయిన్పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పుతిన్… ఉక్రెయిన్పై యుద్ధాన్ని సమర్థించుకున్న ఆయన.. శాంతియుతంగా…
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. భీకర దాడులు 10వ రోజుకు చేరుకున్నాయి.. అయితే, సుమారు ఐదు గంటలపాటు తాత్కాలికంగా విరమించుకున్న రష్యా.. మళ్లీ కాల్పులతో విరుచుకుపడుతోంది.. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల నుంచి అయిదున్నర గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా.. ఆ తర్వాత మళ్లీ యుద్ధం మొదలైంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు కొనసాగిస్తోంది.. ఉక్రెయిన్లోని పోర్టు సిటీ మారియుపోల్, వోల్నావోఖా నగరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి…