Russia-Ukraine War: రష్యా భీకర దాడులు.. పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా ఆంక్షలను లెక్కచేయడంలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించడంలేదు. న్యాయస్థానం తీర్పును తాము పరిగణలోకి తీసుకోవడంలేదంటూ రష్యా ప్రకటించింది. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు అని స్పష్టంచేసింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. నగరాల్లో నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది. విధ్యంసం చేస్తోంది. పోలండ్ సరిహద్దులకు అత్యంత చేరువగా ఉన్న లీవ్ నగరం ఇప్పటివరకు పెద్దగా రష్యా దాడులకు గురి కాలేదు. దీంతో ఇతర ప్రాంతాలనుంచి వలస వెళ్లే వారిలో చాలామంది ఈ నగరంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే రష్యాబలగాలు ఈ నగరాన్నీ వదిలిపెట్టడం లేదు.
Read Also: Telangana: మహిళపై వీఆర్ఏ అత్యాచారయత్నం.. అడ్డుకున్న భర్తపై దాడి
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
గత నెల 24న రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్నుంచి పొరుగు దేశమైన పోలాండ్లోకి వచ్చిన శరణార్థుల సంఖ్య 20 లక్షలు దాటింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. పోలాండ్ బోర్డర్ గార్డ్ ఈ విషయాన్ని తెలిపింది. ఉక్రెయిన్లో రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 816 మంది పౌరులు మృతి చెందారని, మరో 1,333 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం వెల్లడించింది. ఉక్రెయిన్ అధికారులపై మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఉక్రెయిన్ సహకరించడంలేదన్నారు. ఉక్రెయిన్ అధికారులే శాంతి చర్చలు జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్లో శాంతి నెలకొనాలంటే చైనా, అమెరికా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న పరిణామాలను ఎవ్వరూ కోరుకోరని, ఈ పరిణామాలతో ఎవరికీ ప్రయోజనం కూడా లేదని స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా రష్యాలో చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నాడు టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్. వారి విద్యకు బాసటగా నిలుస్తానని చెప్పాడు. తన పౌండేషన్ ద్వారా దాదాపు నాలుగు కోట్ల సాయాన్ని అందిస్తానని ప్రకటించాడు.
తాజావార్తలు
-
Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్