కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఉపాది రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. జనజీవనం సాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో రద్దీ పెరిగింది. ఇప్పటికే సిటీ బస్ సర్వీసులను అందుబాటులో ఉంచిన ఆర్టీసీ, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తెల్లవారు జాము 4 గంటల నుంచే ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటుగా, ఎంజీబీఎస్, జేబీఎస్ లలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ…
నష్టాల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ.. క్రమంగా పుంజుకుంటోందా..? ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా..?అవుననే అంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ ఆదాయం పెరిగిందని చెబుతున్నారు..ఆర్టీసీ ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగిందన్నారు ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సహకారంతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. రాబోయే మార్చిలోపు తార్నాక ఆసుపత్రిని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు…
చాలారోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీకి రవాణా మంత్రి.. సంస్థకు ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ వచ్చారు. ఈ మార్పు రుచించలేదో ఏమో.. ఆర్టీసీవైపు కన్నెత్తి చూడటం లేదు మంత్రి. సంస్థ ఛైర్మన్ను కలిస్తే ఒట్టు. కలిసి సమీక్షల్లేవ్. ఎందుకిలా? మంత్రికి ఉన్న అభ్యంతరాలేంటి? ఆర్టీసీ వ్యవహారాలపై మంత్రి టచ్ మీ నాట్..! పువ్వాడ అజేయ్ కుమార్… తెలంగాణ రవాణా మంత్రి. బాజిరెడ్డి గోవర్దన్… తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్టీసీలో వ్యవహారాలను అన్నీ తానై చూసిన…
సాధారణంగా విద్యార్థులు బస్ పాస్ పొందడమే కాదు.. దాని రెన్యూవల్ కు కూడా ఎంతో శ్రమించాల్సి వస్తుంది.. రెన్యూవల్ డేట్ వచ్చిందంటే చాలు.. విద్యార్థులు, విద్యార్థినులకు కష్టాలు తప్పడం లేదు.. గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి.. ఇక, కొన్ని సార్లు క్లాసులకు డుమ్మా కొట్టి బస్ పాస్ రెన్యూవల్ కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ, త్వరలోనే విద్యార్థుల బస్ పాస్ రెన్యూవల్ కష్టాలు తొలగిపోనున్నాయి… ప్రతి నెలా ఆన్లైన్లోనే విద్యార్థుల బస్ పాస్లు రెన్యూవల్…
తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై టి.ఎస్.ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు. గడిచిన 5 రోజుల్లనే 1.3కోట్ల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చిందని… దీనిపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జనార్. టి.ఎస్.ఆర్టీసీని ప్రయాణీకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని… ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్న ప్రయాణిక దేవుళ్ళందరికి వందనాలు అని చెప్పారు. ఎటువంటి…
నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే…
ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన తర్వాత.. సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక ఆడ, ఒక మగ అధికారులతో కమిటీ ఉంటుందని.. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించి…
కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది. కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది.…
కరోనా కారణంగా చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం కొన్ని సర్వీసులను నడుపుతున్నారు. కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోవడంతో తిరిగి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి నగరంలో 100 శాతం బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. 1285 ఆర్టీసీ, 265 అద్దె బస్సులు కలిపి మొత్తం 1551 బస్సులు ఈరోజు నుంచి నగరంలో రోడ్డుమీదకు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని…
తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఈ మధ్యే టీఎస్ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ను నియమించారు.. ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆర్టీసీ పరిస్థితిపై అధ్యయనం మొదలు పెట్టారు.. ఇక, ఇవాళ ఆర్టీసీ చైర్మన్గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్.. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీనియప్ రాజకీయనేతగానే…