ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలను మంచు చుట్టుముట్టడంతో పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు, అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న చలిగాలులతో దృశ్యమానత తగ్గింది. ఈరోజు (జనవరి 4) ఉదయం రన్వేపై దృశ్యమానత సున్నాగా ఉండటంతో విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసినందున ఢిల్లీ ఎయిర్ పోర్టులో 150కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా…
మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. రోహిత్ శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. హిట్ మ్యాన్ లాంటి ప్లేయర్ను బెంచ్ మీద కూచోబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు.
Rohit Sharma On Retirement: సిడ్నీ టెస్ట్కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్…
RIP GOUTAM GAMBHIR: టీమిండియా ఐదో టెస్టులో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత, క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మను ఐదో టెస్ట్ నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో “RIP Gautam Gambhir” అనే హ్యాష్ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి వేలాదిగా ట్వీట్లు చేస్తున్నారు. గంభీర్ టీమ్ మేనేజ్మెంట్లో…
అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతోన్న రోహిత్కు మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-టీం ఇండియా జట్ల మధ్య ఐదో(చివరి)టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సిరీస్లో చివరి 3 మ్యాచ్ల్లో రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.
సిడ్నీ వేదికగా రేపటి (జనవరి 2) నుంచి ఆసీస్తో ఐదో టెస్టు ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రోహిత్ను తప్పిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, వీటికి టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
Gautam Gambhir: టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ మినహా న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరాభవాలతో భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీమ్ ను గాడిన పెట్టేందుకు కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది.
రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నారు. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పాలని టీమిండియా సారథి రోహిత్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది..
కెప్టెన్ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కెప్టెన్గా లేకపోతే ప్లేయింగ్ ఎలెవన్లో రోహిత్ స్థానం ప్రశ్నార్థకంగా మారేదన్నాడు. హిట్మ్యాన్ బ్యాటర్గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. రోహిత్ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో ఒక హాఫ్ సెంచరీ మినహా రాణించలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కనీసం 20, 30 పరుగులు కూడా చేయట్లేదు.…