Rohit Sharma Use Phone: రోహిత్ శర్మ ఏ ఫోన్ వాడుతాడో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు
- కటక్ వన్డేలో రోహిత్ అద్భుత సెంచరీ
- మ్యాచ్ తర్వాత ఫోన్లో మాట్లాడుతూ కనిపించిన రోహిత్
- రోహిత్ ఫోన్ లో మాట్లాడిన వీడియో వైరల్
- వన్ ప్లస్ 12లో మాట్లాడిన రోహిత్ శర్మ.
భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా.. రెండో వన్డే బారాబాతి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 305 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 32వ వన్డే సెంచరీ సాధించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 90 బంతుల్లో 132.22 స్ట్రైక్ రేట్తో 119 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. రోహిత్ అద్భుత బ్యాటింగ్తో భారత జట్టుకు విజయాన్ని అందించాడు.
Also Read
- KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్గానే చూశారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
- TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక
- Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
కాగా.. కటక్లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎందుకు అనుకుంటున్నారా..? రోహిత్ శర్మ మాట్లాడుతున్నట్లు కనిపించిన ఫోన్ గురించి.. రోహిత్ చేతిలో ఉన్నది ఐఫోన్, ఇంకా ఏదో పెద్ద ఫోన్ కాదు.. వన్ప్లస్ ఫోన్ 12. ఇండియాలో OnePlus 12 ధర రూ. 58 వేల నుండి రూ. 61 వేలు ఉంది. ఇంత పెద్ద క్రికెటర్ వన్ ప్లస్ ఫోన్ మాట్లాడటమేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: Speaker Ayyanna Patrudu: ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు..!
ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ హీరోగా నిలిచాడు. రోహిత్ 90 బంతుల్లో 132.22 స్ట్రైక్ రేట్తో 119 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 2023 అక్టోబర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. మార్చి 2024 తర్వాత ఇది అతని తొలి సెంచరీ. 2024 అక్టోబర్ తర్వాత రోహిత్ పేలవమైన ఫామ్ను ఎదుర్కొన్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లతో సహా 8 మ్యాచ్ల్లో అతను ఒక్కసారి మాత్రమే యాభై మార్కును దాటాడు. ఆ తరువాత.. విఫలమవుతూనే ఉన్నాడు. తాజాగా అద్భుతమైన సెంచరీ సాధించి అందరి నోళ్లు మూయించాడు.
Captain Rohit Sharma uses One Plus phone…!!!📱☎️ pic.twitter.com/9u0oxUsV8L
— CRICKET 360° (@gurlabhsingh610) February 9, 2025
తాజావార్తలు
-
KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్గానే చూశారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
-
TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నిక
-
Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
-
Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
-
Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!