Rohit Sharma Use Phone: రోహిత్ శర్మ ఏ ఫోన్ వాడుతాడో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు
- కటక్ వన్డేలో రోహిత్ అద్భుత సెంచరీ
- మ్యాచ్ తర్వాత ఫోన్లో మాట్లాడుతూ కనిపించిన రోహిత్
- రోహిత్ ఫోన్ లో మాట్లాడిన వీడియో వైరల్
- వన్ ప్లస్ 12లో మాట్లాడిన రోహిత్ శర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా.. రెండో వన్డే బారాబాతి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 305 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 32వ వన్డే సెంచరీ సాధించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 90 బంతుల్లో 132.22 స్ట్రైక్ రేట్తో 119 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. రోహిత్ అద్భుత బ్యాటింగ్తో భారత జట్టుకు విజయాన్ని అందించాడు.
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
కాగా.. కటక్లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎందుకు అనుకుంటున్నారా..? రోహిత్ శర్మ మాట్లాడుతున్నట్లు కనిపించిన ఫోన్ గురించి.. రోహిత్ చేతిలో ఉన్నది ఐఫోన్, ఇంకా ఏదో పెద్ద ఫోన్ కాదు.. వన్ప్లస్ ఫోన్ 12. ఇండియాలో OnePlus 12 ధర రూ. 58 వేల నుండి రూ. 61 వేలు ఉంది. ఇంత పెద్ద క్రికెటర్ వన్ ప్లస్ ఫోన్ మాట్లాడటమేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: Speaker Ayyanna Patrudu: ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు..!
ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ హీరోగా నిలిచాడు. రోహిత్ 90 బంతుల్లో 132.22 స్ట్రైక్ రేట్తో 119 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 2023 అక్టోబర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. మార్చి 2024 తర్వాత ఇది అతని తొలి సెంచరీ. 2024 అక్టోబర్ తర్వాత రోహిత్ పేలవమైన ఫామ్ను ఎదుర్కొన్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లతో సహా 8 మ్యాచ్ల్లో అతను ఒక్కసారి మాత్రమే యాభై మార్కును దాటాడు. ఆ తరువాత.. విఫలమవుతూనే ఉన్నాడు. తాజాగా అద్భుతమైన సెంచరీ సాధించి అందరి నోళ్లు మూయించాడు.
Captain Rohit Sharma uses One Plus phone…!!!📱☎️ pic.twitter.com/9u0oxUsV8L
— CRICKET 360° (@gurlabhsingh610) February 9, 2025
తాజావార్తలు
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!