Home
Road Accident
Road Accident News
-
మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ గాయపడ్డ… -
పోలీస్ స్టేషన్ లో ‘గృహలక్ష్మీ’ సీరియల్ నటి.. అర్ధరాత్రి తప్పతాగి
టాలీవుడ్ బుల్లితెర నటి లహరిపై కేసు నమోదయ్యింది. మంగళవారం రాత్రి ఆమె తన కారులో వెళ్తూ ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొన్నది.. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని లహరిని, కారును పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి లహరి మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వెళ్తోన్న… -
వైరల్ వీడియో: చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యం
తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం ఏకంగా బిడ్డ ప్రాణాన్నే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేద్దామని తల్లిదండ్రులు తమ చిన్నారితో కలిసి బైకు మీద బయటకు వచ్చారు. అయితే చిన్నారిని బైక్ నుంచి కిందకు దింపకుండా బండి మీదే కూర్చోబెట్టి తల్లిదండ్రులు రోడ్డుపై షాపింగ్ చేస్తున్నారు. బైక్ మీద కూర్చున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా… బైకు అదుపు… -
బ్రేకింగ్: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారు విజయనగరం,శ్రీకాకుళం జిల్ల్లాలకు… -
లారీని ఢీకొన్న కారు.. కారులో చెలరేగిన మంటలు
హైదరాబాద్ నగరంలోని పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్కు దమ్మాయిగూడకు చెందిన మయూర్గా పోలీసులు గుర్తించారు.… -
నిన్ను ఇలా పరిచయం చేస్తానని అనుకోలేదు.. తట్టుకోలేకపోతున్నా
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆనతి కాలంలోనే మంచి ట్యాలెంట్ ఉన్న హీరో అని అనిపిచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రంతో కుర్రాళ్లను అభిమానులుగా మార్చేసుకున్న కిరణ్ తాజాగా ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ హీరో ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. తన అన్న రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక తాజాగా సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా… -
టాలీవుడ్ లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతినే జీర్ణించుకోలేకపోతున్న టాలీవుడ్ ని ఇంకా తీవ్ర విషాదంలోకి నెడుతూ ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.… -
ఇండస్ట్రీలో మరో విషాదం… శోకసంద్రంలో హీరో ఫ్యామిలీ
ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన… -
అమెరికాలో రోడ్డుప్రమాదం.. సూర్యాపేట వాసి మృతి
అమెరికాలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి చెందాడు. దీంతో సూర్యాపేట పట్టణంలో విషాదం నెలకొంది. అమెరికాలోని ఒహయో స్టేట్ ప్రాంతంలో జాబ్ చేస్తున్న సూర్యాపేట వాసి చిరుసాయి ఉద్యోగం అయిపోగానే కారులో రూమ్కు వెళ్తున్న సమయంలో టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చిరుసాయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో చిరుసాయితో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయాడు. Read Also: న్యూ ట్రెండ్… సైకిల్పై పెళ్లి మండపానికి వెళ్లిన హైదరాబాదీ వరుడు అయితే ఈ… -
బెంగాల్లో దారుణం… అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం… 18 మంది మృతి…
పశ్చిమ బెంగాల్లో ఓ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 35 మంది బంధువులు ట్రక్కులో బయలుదేరారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ట్రక్కు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. Read: ఒమిక్రాన్పై ప్రపంచదేశాలు అప్రమత్తం… మొదలైన ఆంక్షలు… ఇక మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.…
తాజావార్తలు
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!