ఉదయాన్నే కాలేజీకి వెళ్లిన కూతురు శవమై తిరిగి ఇంటికివస్తే ఆమె తల్లిదండ్రుల మనోవేదన వర్ణానాతీతం. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. గాజులరామరంకు చెందిన మేఘన దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది. నేడు మధ్యాహ్న సమయంలో మరో స్నేహితురాలు సుమనశ్రీ తో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన…
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి సంగం వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 15 మంది వాగు ఉధృతికి కొట్టుకుపోయారని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వాగులో భారీ వరదలో పలువురు ప్రయాణికులు కొట్టుకుపోతుండగా.. ఏడుగురిని స్థానికులు…
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ గాయపడ్డ…
టాలీవుడ్ బుల్లితెర నటి లహరిపై కేసు నమోదయ్యింది. మంగళవారం రాత్రి ఆమె తన కారులో వెళ్తూ ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొన్నది.. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని లహరిని, కారును పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి లహరి మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వెళ్తోన్న…
తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం ఏకంగా బిడ్డ ప్రాణాన్నే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేద్దామని తల్లిదండ్రులు తమ చిన్నారితో కలిసి బైకు మీద బయటకు వచ్చారు. అయితే చిన్నారిని బైక్ నుంచి కిందకు దింపకుండా బండి మీదే కూర్చోబెట్టి తల్లిదండ్రులు రోడ్డుపై షాపింగ్ చేస్తున్నారు. బైక్ మీద కూర్చున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా… బైకు అదుపు…
చిత్తూరు జిల్లాలో రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారు విజయనగరం,శ్రీకాకుళం జిల్ల్లాలకు…
హైదరాబాద్ నగరంలోని పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్కు దమ్మాయిగూడకు చెందిన మయూర్గా పోలీసులు గుర్తించారు.…
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై ఆనతి కాలంలోనే మంచి ట్యాలెంట్ ఉన్న హీరో అని అనిపిచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా తరువాత ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రంతో కుర్రాళ్లను అభిమానులుగా మార్చేసుకున్న కిరణ్ తాజాగా ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇకపోతే ఇటీవలే ఈ యంగ్ హీరో ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. తన అన్న రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక తాజాగా సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా…
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతినే జీర్ణించుకోలేకపోతున్న టాలీవుడ్ ని ఇంకా తీవ్ర విషాదంలోకి నెడుతూ ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.…
ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన…