సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పోలికల్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో ఈ రెండు పార్టీలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పార్టీలు జనసమీకరణపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ రెండు పార్టీలు సెప్టెంబర్…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వీరికి బయటి శత్రువుల కంటే లోపటి శత్రువులే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ను ఈదలాంటే చిన్నచిన్న చేపలు బలి కావాల్సిందనేలా ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటే నేతలంతా సీఎం పదవితో సమానంగా చూస్తుంటారు. దీని కోసం నేతల మధ్య కుస్తీలు మామూలుగా ఉండవు. ఈ విషయం మొన్నటి టీపీసీసీ చీఫ్ నియామకంతో…
కోకాపేట భూములపై సీబీఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని,.. ఈ కుంభకోణంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ సర్కార్పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. కుంభకోణాల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని… కెసిఆర్ సన్నిహితులు ఉన్నతాధికారులు భూములు దక్కించుకున్నారని ఆరోపించారు. అధికార బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని… ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి…
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అధికంగా కనిపించేవారు. ఇప్పుడు సీనియర్లతో పాటుగా దూకుడు కలిగిన యువనేతలు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నారు. సీనియర్లు యువ నేతలతో కాంగ్రెస్ పార్టీ నిండుదనంగా కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేసిన తరువాత కాస్తంత దూకుడును ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి మొదట్లో వర్కింగ్ ప్రెసిడెండ్గా బాధ్యతలు అప్పగించగా, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో, రేవంత్కు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. తెలంగాణ…
తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు, కొత్త కమిటీల నియామకం తర్వాత తొలిసారి హస్తినబాట పట్టారు నేతలు.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన టి. కాంగ్రెస్ నేతలు.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు హాజరయ్యారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ…
హూజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా ఆయన వేవ్ కొనసాగుతోంది. అయితే ఈటలను ఎలాగైనా హుజూరాబాద్లో ఓడించాలని సీఎం కేసీఆర్ పకడ్బంధీగా పావులు కదుపుతున్నారు. దీంతో ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పోటీ మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మొదటి…
తెలంగాణ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తిన తాకింది.. తన పాదయాత్రకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.. కొత్త పీసీసీ చీఫ్ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ…
ఏఐసీసీ తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని, కమిటీలను ప్రకటించిన తర్వాత.. పార్టీలో కొత్త ఊపువచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఇక, టి.పీసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను నియమించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ మేరకు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులకు పార్లమెంట్ నియోజక…
‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు బండ్ల గణేష్ తన మద్దతు యూటర్న్ తీసుకోవడంతో హాట్ టాఫిక్గా మారింది. జీవితా రాజశేఖర్ ఎంట్రీతో బండ్ల గణేష్ ఎగ్జిట్ అయ్యారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని బండ్ల గణేష్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ప్రస్తుతం రాజకీయాల గూర్చి మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ…
కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. దీంతో ఎవరికి తోచినట్టు వారు చేసేస్తుంటారు.. అయితే, కాంగ్రెస్ పార్టీలో తాజా పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పార్టీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ముగ్గురు ముఖ్యమేనని మీడియా చిట్చాట్లో అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి, పీసీసీ కొత్త కమిటీకి గ్యాప్ ఉందని.. కాకపోతే అందరం కలిసి పని చేయాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఇక,…