హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలతాల్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది.ఆది నుంచి కూడా ఏ రౌండ్లోనూ ఆధిపత్యం సాధించలేకపోయింది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ఫలతితాలకు తనదే బాధ్యత అని ఆయన చెప్పారు. ఒక ఉప ఎన్నికతో పార్టీనీ నిర్దేశించలేదన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని నిలబెట్టినా… ఊరుఊరు వెంకట్ తిరిగాడన్నారు. భవిష్యత్లో పార్టీకి బలమైన నాయకుడు అవుతారన్నారు. రేపటి నుండే నియోజక వర్గంలో ఉంటారు.
కష్టపడి పని చేసే ఓపిక.. సహనం నాకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. క్యాడర్ ఆత్మ స్థైర్యంతో ఉండాలన్నారు. యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు రాజ్యం పాలిస్తారు. ఓడిపోయిన వాళ్లు బానిసలు అవుతారని కానీ ఇది రాజరికం కాదని, ఓటమి గెలుపునకు దారులు వేస్తుందన్నారు. నేను అండగా ఉంటా, ఈ ఓటమి నాలో మరింత కసి పెంచుతుందని రేవంత్రెడ్డి అన్నారు. గులాబీ చీడ వదులుతుందని రేపటి నుంచే జనంలోకి వెళ్తాం అన్నారు. ఎన్ని కలు.. ప్రత్యేక సందర్భంలో జరిగాయని, భవిష్యత్లో అన్ని వివరాలు అంశాలను వివరంగా వివరిస్తామన్నారు. నిరాశ నుంచే పార్టీ నిర్మాణం చేపట్టనున్నట్టు రేవంత్రెడ్డి తెలిపారు.