నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి…
తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ విధానాలవల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో…
తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోనే ప్రగతి సాధ్యమయిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నారాయణ పేట్ కోస్గి పట్టణ కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హల్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి TPCCఅధ్యక్షులు , మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 500 మందికి పైబడి సభ్యత్వం చేయించిన నాయకులను ఘనంగా సన్మానించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజక వర్గంలో…
ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మిర్చిరైతుల సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు.మిగత పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా…
ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ? కొండాతో కలిసి సాగడానికి సాహసించడం లేదా?మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు. మరోసారి బీజేపీ పథకాలు, కార్యక్రమాలపై…
TRS రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 24న కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కారు ఎక్కిన ఆయన.. తిరిగి సొంత గూటికి వస్తున్నారు. ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే తగిన ప్రాధాన్యత…
రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అశు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేశారన్నారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లపై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్పై ఒత్తిడి తేకపోవడంతోనే ఎర్రెబెల్లిపై విసిగిపోయార్నారు. అందుకే కాంగ్రెస్లో చేరుతున్నారని రేవంత్రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…
తెలంగాణలో పెద్ద ఎత్తున మెంబర్ షిప్ చేయించాలని కృతనిశ్చయంతో వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ దిశగా నేతలు, కార్యకర్తల్ని ముందుకు నడిపిస్తున్నారు. 5 మండలాలలో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ గెలుస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. 35 మండలాలలో బలంగా ఉంటే ఎంపీ స్థానం గెలుస్తాం.. 600 మండలాలలో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని రేవంత్ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు. మండలాలలో అధ్యక్షులు సరిగా పని చేయకపోతే వారిపై చర్యలు…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదు- అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటాడు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు…