పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.
సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి ఒక కార్గో షిప్పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత భారత నావికాదళం చర్యలు చేపట్టింది. ఈ దాడిపై ఓడ సిబ్బంది భారత నౌకాదళానికి అత్యవసర హెచ్చరిక (SOS) పంపింది. సమాచారం అందిన వెంటనే డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని పంపినట్లు భారత నావికాదళం వెల్లడించింది.