Indian Navy: అరేబియా సముద్రంలో డ్రోన్ దాడి.. స్పందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి ఒక కార్గో షిప్పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత భారత నావికాదళం చర్యలు చేపట్టింది. ఈ దాడిపై ఓడ సిబ్బంది భారత నౌకాదళానికి అత్యవసర హెచ్చరిక (SOS) పంపింది. సమాచారం అందిన వెంటనే డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని పంపినట్లు భారత నావికాదళం వెల్లడించింది.
Merugu Nagarjuna: దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
పోర్ట్ అడెన్కు దక్షిణంగా 60 నాటికల్ మైళ్ల దూరంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. కాగా.. ఈ దాడి ఘటనపై ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ స్పందించిందని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. ఓడలో తొమ్మిది మంది భారతీయులు సహా 22 మంది సిబ్బంది ఉన్నారు. బుధవారం రాత్రి 11.11 గంటలకు మార్షల్ ఐలాండ్స్ జెండాతో కూడిన వాణిజ్య నౌక ‘ఎంవీ జెన్కో పికార్డీ’పై డ్రోన్ దాడి జరిగింది.
Harish Rao: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది..
నౌక నుంచి ఎమర్జెన్సీ అలర్ట్ అందిన వెంటనే భారత నావికాదళ యుద్ధనౌక రాత్రి 12.30 గంటలకు సాయం అందించింది. ఈ సమయంలో సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదు. సముద్రపు దొంగలు, ఇతర రెస్క్యూ కార్యకలాపాలను తరిమికొట్టడానికి భారత నావికాదళం గల్ఫ్ ఆఫ్ అడెన్లో INS విశాఖపట్నం మోహరించింది. INS విశాఖపట్నంలో ఉన్న నౌకాదళ EOD నిపుణులు.. జనవరి 18 ఉదయం దాడికి గురైన ఓడలో ఎక్కారని, దెబ్బతిన్న భాగాలను పరిశీలించిన తర్వాత, దానిని తిరిగి తన ప్రయాణానికి అనుమతించారని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో.. నావల్ మెరైన్ కమాండోలు ఉత్తర అరేబియా సముద్రంలో సరుకు రవాణా నౌకలో 21 మంది సిబ్బందిని రక్షించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!