ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుస్తుందని మిస్టర్ 360, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. క్వాలిఫయర్-1లో తేలిపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. జోష్ హేజిల్వుడ్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ బలంగా మారిందన్నాడు. భువనేశ్వర్ కుమార్ టోర్నీలో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని ఏబీడీ తెలిపాడు. తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్పై అద్భుత విజయం సాధించిన ఆర్సీబీ నేరుగా…
ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్పై అద్భుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని ఆర్సీబీ ఖాతాలో వేసుకుంది. క్వాలిఫయర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆర్సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్స్ మాత్రమే కోల్పోయి సునాయాస విజయం సాధించింది. ఇక ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న ఐపీఎల్ టైటిల్కు ఆర్సీబీ అడుగు దూరంలో నిలిచింది.…
ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
ఆర్సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో దొంగ దొరికాడురా అంటూ సోషల్ మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. అతడు చేసిన పోస్టును ట్రోలింగ్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్కు తిరిగి రావాలని సూచించారు.
RCB's IPL Playoff Record: ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఆర్సీబీ అభిమానుల నుంచి ఎక్కువగా వినిపించే మాట.. ‘ఈసాలా కప్ నమదే’.. కానీ ఆ జట్టు కల ఈ సారి నెరవెరే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2025కు ముందు జట్టులో భారీ మార్పులు చేసిన బెంగళూరు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా తయారైంది.
ఐపీఎల్ 2025లో తన చివరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్ శర్మ (85 నాటౌట్) , విరాట్ కోహ్లీ (54)లు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్-2లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో స్థానం కోసం క్వాలిఫయర్ 1లో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ సహా టీ20 క్రికెట్లో ఓ జట్టు తరఫున 9 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 9000 పరుగుల…
నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ పై విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ పై విజయం తర్వాత CSK 8 పాయింట్లతో తమ లీగ్ ను ముగించింది. ఈ విజయంతో చెన్నైకి పెద్దగా ఒరిగేదేమి లేనప్పటికీ గుజరాత్ భారీ నష్టాన్ని చవిచూసింది. టాప్-2 కి చేరుకోవాలనుకున్న తమ ఆశలకు గండి పడింది. ఈ మ్యాచ్లో చెన్నైపై విజయం సాధించి ఉంటే గుజరాత్ 20 పాయింట్లతో ముందంజలో ఉండేది. అప్పుడు మిగిలిన…
చేయని తప్పుకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బలయ్యాడు. నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పటిదార్కి 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన పటిదార్..
కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని చావుదెబ్బ కొట్టింది. ఈ ఓటమితో క్వాలిఫయర్ వన్కి అర్హత సాధించాలని భావించిన ఆర్సీబీకి చుక్కెదురైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.