‘మా ఇష్టం’ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. నిన్నటిదాకా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, కేసులు పెట్టుకున్న ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు సయోధ్య కుదిరింది. తమ మధ్య ఏర్పడ్డ అపార్ధాలు పూర్తిగా తొలగిపోయాయని తెలిపిన ఆ ఇద్దరు.. పరస్పరం నమోదు చేసుకున్న కేసుల్ని సైతం వెనక్కు తీసుకున్నట్టు సంయుక్తంగా ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో…
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆయన సినిమాలేవీ రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, కరుణలపై వర్మ కేసు పెట్టిన నేపథ్యంలో.. నట్టికుమార్ తీవ్రంగా స్పందించారు. తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. ఆర్జీవీ తన పిల్లలపై తప్పుడు కేసులు పెట్టాడని ఫైరయ్యారు. తమ దగ్గర నుంచి వర్మ డబ్బులు బాగా తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే మాత్రం ఫేక్ అంటూ…
ఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకెక్కే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఓ పోలీస్ కేసుతో తెరమీదకొచ్చారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆయన నట్టి క్రాంతి, కరుణ అనే వ్యక్తులపై పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించిన వర్మ.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో తన సంతకాన్ని వాళ్ళు ఫోర్జరీ చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2020 నవంబర్ 30వ తేదీన తన లెటర్ హెడ్ తీసుకొని, నకిలీ పత్రాల్ని సృష్టించి, ఫోర్జరీ…
వివాదాలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ నెటిజన్ల నోటిలో ఎప్పుడు నానుతూనే ఉంటాడు. ఒక్కోసారి బాలీవుడ్ అంటదు.. ఇంకోసారి టాలీవుడ్ అంటదు.. మరోసారి రాజకీయ నాయకులను ఏకిపారేస్తాడు.. ఇంకోసారి హీరోయిన్లను ఎత్తేస్తాడు. ఇలా నిత్యం ఏదో ఒక వార్తలో మాత్రం ఉంటూనే ఉంటాడు. ఇక తాజాగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ…
బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడికెళ్ళి తన సమయాన్ని వృధా చేసుకోలేనని మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. బాలీవుడ్ నుంచి తారాస్థాయి వ్యతిరేకత ఎదురవుతోంది. మహేశ్ని చాలా బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు. తాను బాలీవుడ్ని కించపరచలేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మహేశ్పై విమర్శలు ఆగడం లేదు. అయితే.. నిర్మాత బోనీ కపూర్ మాత్రం తాను మహేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చేతులెత్తేశాడు. ఆ కామెంట్స్పై రియాక్ట్ అవ్వడానికి తాను…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దెబ్బ మీద తగులుతుంది. మొన్నటికి మొన్న తన సినిమా ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ కు రెండు రోజులు ఉంది అనగా నిర్మాత నట్టికుమార్ సినిమా ఆపివేయాలని స్టే తెచ్చిన విషయం విదితమే. తనవద్ద డబ్భులు తీసుకొని ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపివేయాలని తెలుపుతూ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు స్టే విధించింది. ఇక…
వివాదాల దర్శకుడు ఏమి చేసినా అది సంచలనమే.. ఇక హీరోయిన్లతో వర్మ చేసే రచ్చ అది మరో హైలైట్ ఉంటుంది. యాంకర్లను స్టార్లను చేయడం, తన హీరోయిన్లను సెలబ్రిటీలను చేయడం వర్మకు కొట్టిన పిండి. ఇక తాజాగా వర్మ చూపు ఇద్దరు డేంజరస్ అమ్మాయిల మీద పడింది. వర్మ దర్శకత్వంలో అప్సర రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం డేంజరస్. మొట్టమొదటి లెస్బెనియన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడి…
అజయ్ దేవ్గన్ వర్సెస్ కిచ్చా సుదీప్ అన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో పరిస్థితి. హిందీ భాష ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ పై అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించాడు. ఇక సుదీప్ కూడా మీరు హిందీలో ఇచ్చిన రిప్లైని నేను చదవగలిగాను. మరి నేను కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా నేను ఆ మాటను అన్న సందర్భం వేరు, అది మీకు చేరిన విధానం…
తన ‘డేంజరస్’ సినిమాను ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ కుట్ర పన్ని ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ తో రిలీజ్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు క్రింద కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. నట్టి క్రాంతి, నట్టి కరుణతో పాటు మీడియాలో నా పై వేసిన నిందలు, చేసిన ఆరోపణలకు నట్టి కుమార్ మీద నేను,తుమ్మలపల్లి రామత్యనారాయణ పరువు నష్టం దావా కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫోర్జరీ…