దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇదిలావుంటే, ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్ని విడుదల చేశారు. చెవిటి పాత్రకు ప్రాణం పోసిన చిట్టిబాబు తమిళంలో…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. టాలీవుడ్ స్టార్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా సోకగా… ఈరోజు ఆయన కరోనాతో మృతి చెందాడు. చరణ్ సిబ్బందిలో ఒకరు కరోనాతో ఆకస్మికంగా చనిపోవడం విషాదకరం. ప్రస్తుతం చరణ్ కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్ లోకి వెళ్లారట. త్వరలోనే చరణ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు.…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ‘పుష్ప’ తరువాత సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా వార్తల ప్రకారం సుకుమార్ తన నెక్స్ట్ మూవీని రామ్ చరణ్ తో చేయబోతున్నాడట. చరణ్ కు సుకుమార్ కథను కూడా వివరించాడట. చరణ్ కు సుకుమార్…
దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’`. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి…