నిన్నటి తుఫాను యాస్ తీవ్రమై నిన్న రాత్రి తీవ్ర తుఫాను ‘YAAS'(యాస్)గా మారింది. ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు పశ్చిమ & పరిసరాల్లోనే ఉన్న తూర్పుమధ్య & ఉత్తర బంగళాఖాతంలో కొనసాగుతూ, పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిమి దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ, మరింత…
తెలంగాణకు మరో 3 రోజులపాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి దిశ నుండి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, దక్షిణ బంగళాఖాతంలో కొంత భాగం, నికోబార్ ద్వీపం, దక్షిణ అండమాన్ సముద్రము మొత్తం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొంత భాగాములోకి నైరుతి రుతపవనాలు ఈరోజు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.…
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటలలో నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఎల్లుండి (22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని… ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది…
తౌక్టే తుఫాన్ తో ఇప్పటికే కేరళ వణికిపోతుంది. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అయితే తౌక్టే తుఫాను తెలంగాణా రాష్ట్రం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రంలో దక్షిణ దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (18,19,20వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన…
తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అత్యంత తీవ్ర తుఫాను’ తౌక్టే’ ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. గడచిన 6 గంటలలో 15 km వేగంతో ప్రయాణిస్తూ, బలపడి ఈ రోజు ఉదయం 08:30 గంటలకు 18.8°N latitude మరియు 71.5°E longitude లలో, ముంబయికి పశ్చిమ దిశగా 150 km దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, గుజరాత్ తీరంలోని పోర్బందర్ – మహువాల మధ్య ఈ…
ఇండియాలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలో ముంపు దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూరుకు 360 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగాల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫానుగా మారితే దీన్ని ‘తౌక్టే’ అని పిలుస్తారు. ‘తౌక్టే’ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది.. గుజరాత్ వద్ద…
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు…
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.
తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు ఇంటీరియర్ ఒడిస్సా నుండి విదర్భా, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9కిమి ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణా రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని..…
తెలంగాణకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న జార్ఖండ్ నుండి ఛత్తీస్ ఘడ్, తెలంగాణాల మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిమి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నైరుతి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుండి మరత్వాడా మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిమి ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని…