Rajasthan Congress crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సీఎం అశోక్ గెహ్లాట్ చేపడుతారనే వార్తల నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తన సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు యువనేత సచిన్ పైలెట్ రాజస్థాన్ కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో..…
భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. భారత్ జోడో యాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన.. పాదయాత్రను మధ్యలో విడిచి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నమాట.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ…
Rahul Gandhi-Congress Party Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే పదవిని చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పార్టీ సీనియర్ లీడర్ల నుంచి.. సామాన్య కార్యకర్త వరకు రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలని ఏకగ్రీవం తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి.
కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్... పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
T20 World Cup: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో బ్యాట్ పట్టబోతున్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ ఓపెనర్గా రాబోతున్నాడు. ఇదంతా నిజమా అని మీరు అనుకోకండి. రాబోయే టీ20 వరల్డ్ కప్లో ఇండియన్ టీమ్లోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఓ టీవీ యాంకర్ న్యూస్ చదువుతూ తడబడ్డాడు. ఇండియన్ టీమ్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నట్లు…
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తన యాత్రలో రాహుల్ గాంధీ చలాకీగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏ మాత్రం అలసట లేకుండా ఆయన ముందుకు సాగిపోతున్నారు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన కేరళలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన పాదయాత్ర మధ్యలో దొరికిన విరామాన్ని ఉల్లాసంగా గడుపుతున్నారు. సోమవారం నాడు కేరళలో పర్యటిస్తున్న సందర్భంగా పున్నమాడ సరస్సులో జరిగిన స్నేక్ బోట్…