తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్లో రేపు సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. రేపు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో ముఖాముఖీ సమావేశం అవుతారు.
కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి.. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే అవి బీఆర్ఎస్ కు వేసినట్టే.. బీజేపీపై పోరాడినందుకు నాపై కేసులు పెట్టారు.. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె ప్రమాదానికి బారిన పడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరం అని ఆయన కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే లిక్కర్ రాణి బతుకమ్మ మీద గౌరమ్మకు బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడుతాదని కవిత ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడారు.
Kishan Reddy: తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు..రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎం మోడీకి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే.. రామప్ప దేవాలయాన్ని పీఎం అభివృద్ధి చేశారని బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy: రాహుల్ గాంధీకి దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రాహుల్ చర్చలు సిద్దమా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాహుల్ కు సవాల్ విసిరారు.
Rahul Gandhi: తెలంగాణతో మాకు కుటుంబ సంబంధం ఉందని, రాజకీయ సంబంధం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారంలో ఇవాళ ఉదయం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగించారు.
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. షెడ్యూల్ వచ్చాక అగ్ర నాయకులందరినీ తిప్పాలని డిసైడ్ అయింది. ఇక్కడ కూడా కర్ణాటక తరహాలోనే కాంగ్రెస్ ముఖ్య నాయకులందరితో ముమ్మరంగా ప్రచారం చేయించాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకల ప్రచార పర్వం మొదలైపోయింది. మహిళా సమస్యలపై ములుగు సభలో చర్చించారు ఇద్దరు అగ్రనేతలు. ఇదే వేదిక నుంచి మహిళలకు భరోసా ఇచ్చింది కాంగ్రెస్. ములుగు సభ తర్వాత ప్రియాంక ఢిల్లీ వెళ్ళగా…. రాహుల్ వరుసగా…
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గురువారం భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 18న ములుగు నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభించారు.