Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ డేట్ వస్తువుల సరఫరా..!
- బిగ్ బాస్కెట్ గోదాములో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి
- కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ ఫుడ్ సరఫరా వెలుగులోకి
- లైసెన్స్ లేకుండానే అక్రమంగా నిర్వహణ
- కేసు నమోదు.. కఠిన చర్యలకు సిద్ధమైన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేస్తే నాణ్యమైన వస్తువులు ఇంటికి వస్తాయని నమ్మే వినియోగదారులకు రాజేంద్రనగర్ బిగ్ బాస్కెట్ (Big Basket) ఘటన ఒక కనువిప్పు. ప్రముఖ ఆన్లైన్ గ్రోసరీ సంస్థ బిగ్ బాస్కెట్ గోదాముపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత పాటించకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సంస్థ తీరుపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్లోని బిగ్ బాస్కెట్ గోదాములో తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీ ఎత్తున నాసిరకం వస్తువులు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన మాంసాహారం (Non-Veg) పూర్తిగా పాడైపోయి, దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, గడువు ముగిసిన (Expired) ఆహార పదార్థాలను కూడా కొత్త వస్తువులతో కలిపి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
Also Read
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
ఈ సోదాల్లో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, సదరు గోదాముకు ఉండాల్సిన ఫుడ్ లైసెన్స్ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కేవలం లాభాల కోసమే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
బిగ్ బాస్కెట్ సంస్థకు ఈ ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న రాజేశ్వరి కంపెనీ పై పోలీసులు , ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల అనంతరం నాసిరకం వస్తువులను సీజ్ చేసిన అధికారులు, నిబంధనలు అతిక్రమించినందుకు బిగ్ బాస్కెట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ డెలివరీ యాప్స్పై ఆధారపడే సామాన్యులు, వస్తువులను అందుకునేటప్పుడు వాటి నాణ్యతను , గడువు తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
-
Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
-
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!