Uttam Kumar Reddy: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునగాల మండల ఎంపీపీ, జడ్పీటీసీ ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఉత్తమ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నేను మాజీ ఎమ్మెల్యే చందర్ రావు అధికారం అడ్డు పెట్టుకొని ఏరోజు కూడా అధికారం దుర్వినియోగం చేయలేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వేనేపల్లి చందర్ రావు కి ప్రత్యేక స్థానం కలిస్తామన్నారు.
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
కోదాడ చరిత్రలోనే చారిత్రాత్మక మార్పు అన్ని భావిస్తున్నాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ ద్వారా 12 లక్షల ఎకరాలు పంటలు పండుతున్నవి.. లక్షల కోట్లతో కట్టిన మెడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం ప్రభుత్వనికి సిగ్గు చేటు.. నాణ్యత లేని ప్రాజెక్టును కట్టినందుకు సిగ్గుపడలి.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అక్కడే కనిస్తుంది.. కోదాడ, హుజుర్ నగర్ లలో 24 గంటల కరెంట్ ఎక్కడ రావడం లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడలో వేల ఎకరాలు ఎండిపోవడానికి కారణం అసమర్ధ ప్రభుత్వం వల్లనే.. మా హయాంలోనే రెండు పంటలు పండిన చరిత్ర ఉంది.. అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి నవంబర్ 3వ తేదీ లోపు నిధులు విడుదల చేయాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read also: Corn Cultivation : మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నవంబర్ 3 నాటికి రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రుణమాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా ఎమ్మెల్యే ఉన్నాడు.. అవినీతి అక్రమాలకు కూడా టోకెన్ వ్యవస్థ పెట్టిన చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది.. మందు తాగే వాళ్లకు కూడా ఎమ్మెల్యే ట్యాక్స్ వేస్తున్నాడు.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ను ఇంటికి పంపించాలి.. అధికార పార్టీ నాయకులు గంజాయి వ్యాపారం చేస్తున్న పట్టించుకోవడం లేదు.. త్వరలో సీఎం కేసీఆర్, మల్లయ్య యాదవ్ ను ఫామ్ హౌస్ కి పరిమితమవుతారు.. రాష్ట్రంలో 70 నుండి 75 స్థానాలు గెలవడం ఖాయం.. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి