Uttam Kumar Reddy: 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునగాల మండల ఎంపీపీ, జడ్పీటీసీ ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఉత్తమ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నేను మాజీ ఎమ్మెల్యే చందర్ రావు అధికారం అడ్డు పెట్టుకొని ఏరోజు కూడా అధికారం దుర్వినియోగం చేయలేదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వేనేపల్లి చందర్ రావు కి ప్రత్యేక స్థానం కలిస్తామన్నారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
కోదాడ చరిత్రలోనే చారిత్రాత్మక మార్పు అన్ని భావిస్తున్నాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ ద్వారా 12 లక్షల ఎకరాలు పంటలు పండుతున్నవి.. లక్షల కోట్లతో కట్టిన మెడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం ప్రభుత్వనికి సిగ్గు చేటు.. నాణ్యత లేని ప్రాజెక్టును కట్టినందుకు సిగ్గుపడలి.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అక్కడే కనిస్తుంది.. కోదాడ, హుజుర్ నగర్ లలో 24 గంటల కరెంట్ ఎక్కడ రావడం లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడలో వేల ఎకరాలు ఎండిపోవడానికి కారణం అసమర్ధ ప్రభుత్వం వల్లనే.. మా హయాంలోనే రెండు పంటలు పండిన చరిత్ర ఉంది.. అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి నవంబర్ 3వ తేదీ లోపు నిధులు విడుదల చేయాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read also: Corn Cultivation : మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నవంబర్ 3 నాటికి రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, రుణమాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా ఎమ్మెల్యే ఉన్నాడు.. అవినీతి అక్రమాలకు కూడా టోకెన్ వ్యవస్థ పెట్టిన చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది.. మందు తాగే వాళ్లకు కూడా ఎమ్మెల్యే ట్యాక్స్ వేస్తున్నాడు.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ను ఇంటికి పంపించాలి.. అధికార పార్టీ నాయకులు గంజాయి వ్యాపారం చేస్తున్న పట్టించుకోవడం లేదు.. త్వరలో సీఎం కేసీఆర్, మల్లయ్య యాదవ్ ను ఫామ్ హౌస్ కి పరిమితమవుతారు.. రాష్ట్రంలో 70 నుండి 75 స్థానాలు గెలవడం ఖాయం.. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
-
Sports Injuries : జిమ్కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
-
Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?