లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకుల్లో పాల్గొన్నారు.