Purandeshwari: ఏపీ ఆర్థిక అంశాలపై నిర్మలా సీతారామన్ కి బీజేపీ ఏపీ చీఫ్ వినతి పత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ఆర్థిక అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక స్థితిపై మరింత క్లారిటీ కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని నిర్మలను ఏపీ బీజేపీ చీఫ్ కోరారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదలకు వినతి చేశారు. ఏపీలో మద్యం స్కాంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని ఆమె తెలిపారు.
Read Also: Wasim Akram: సొంత టీమ్పై మండిపాటు.. రోజూ 8 కేజీల మటన్ తింటే ఇలానే ఉంటుంది
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
లేఖలో పురంధేశ్వరి..
ఏపీ ప్రభుత్వ ఆర్ధిక అవకతవకలపై గతంలోనే ఫిర్యాదు చేశాం..
ఏపీ మొత్తం అప్పులు రూ. 10.77 లక్షల కోట్లు..
ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే కొనసాగుతోంది..
ఏపీ ప్రభుత్వం చేసిన అధికారిక అప్పు రూ. 4.42 లక్షల కోట్లని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీ ప్రతిష్టను వైసీపీ దెబ్బ తీస్తోంది..
రాష్ట్రానికి చెందిన ఎంపీలు అడిగిన ప్రశ్నకు జవాబుగా కేవలం ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రూ. 4.42 లక్షల కోట్ల అప్పులని మాత్రమే చెప్పారు..
రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహ చేసిన ఇతర అప్పులను చెప్పలేదు..
పార్లమెంట్లో ఇచ్చిన ఈ సమాధానాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ వైసీపీ.. బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా ప్రచారం చేస్తోంది..
రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని తిప్పలు నుండి బయట వేయాలనే బీజేపీ రాష్ట్ర శాఖ ప్రయత్నాలను తప్పుగా చిత్రీకరించారు..
ఈ పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మరింత క్లారిటీ ఇవ్వాలి..
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు.. కార్పోరేషన్ల రుణాలు.. గ్యారంటీలను పరిగణలోకి తీసుకుంటూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి..
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్, అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉంది..
ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది..
మద్యం ద్వారా ఏడాదికి రూ. 30 వేల కోట్ల మేర ఆదాయం లెక్కలోకి రావడం లేదు అని లేఖలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!